ధోని బైక్ కలెక్షన్లో
ధోని బైక్ కలెక్షన్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి డుకాటీ 1098, కవాసకీ నింజా ZX14R, హార్లే డేవిడ్సన్ ప్యాట్బాయ్, మయహా YZF600 థండర్ క్యాట్. 2015లో భారత్లో అత్యంత ఖరీదైన బైక్ను కొనుగోలు చేసిన క్రికెటర్గా ధోని అరుదైన ఘనత సాధించాడు. ఆ బైక్ ఎక్స్ షోరూమ్ ఖరీదు రూ. 29 లక్షలు.
భారత ఆర్మీకి సేవ చేసేందుకు
వరల్డ్కప్ తర్వాత భారత ఆర్మీకి సేవ చేసేందుకు గాను ధోని క్రికెట్ నుంచి రెండు నెలలు పాటు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విరామంలో ధోని తనంతట తానుగా వెస్టిండిస్, దక్షిణాప్రికా పర్యటనలకు దూరమయ్యాడు. అయితే, సెప్టెంబర్ నెలలో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లా సిరీస్కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
ధోని కీలక నిర్ణయం
వరల్డ్కప్లో అయిన గాయం కారణంగా ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇంగ్లాండ్ వరల్డ్కప్కు ధోని వెన్నునొప్పితోనే వెళ్లాడు. టోర్నీ సమయంలో ఆ నొప్పి తీవ్రతరం అవడంతో పాటు నాకౌట్ మ్యాచ్లో ధోని చేతికి మణికట్టుకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకుని నవంబర్ నాటికి ధోని ఫిట్ అవుతాడని భావిస్తున్నారు.
నవంబర్ తర్వాతే
ఈ కారణం చేతనే ధోని నవంబర్ వరకు సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండడని చెప్పినట్లు సమాచారం. 38 ఏళ్ల ధోని ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పటికీ వెన్నునొప్పి మాత్రం అతడిని గత కొంతకాలంగా బాధిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా ధోని ఆడటం లేదు. ధోని స్థానంలో కెప్టెన్గా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు.