ప్రాక్టీస్ రద్దు.. ఝార్కండ్కి మహీ
ఐపీఎల్ వాయిదా, కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండడంతో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్రాక్టీస్ సెషన్కు శనివారం ముగింపు పలికింది. దీంతో ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహా అంబటి రాయుడు, సురేశ్ రైనా, మురళి విజయ్ మరికొందరు ఆటగాళ్లు శనివారం చెన్నైను వీడి తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో మహీ శనివారమే స్వస్థలం ఝార్కండ్కి వెళ్లిపోయాడు.
|
బ్యాడ్మింటన్ ఆడిన ధోనీ
కరోనా వైరస్ భయంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అవుతుంటే.. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం అందరికంటే భిన్నంగా గడుపుతున్నాడు. వైరస్ భయం ఉన్నా.. ఝార్కండ్లో మహీ ఖాళీగా కూర్చోలేదు. తాజాగా ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని ధోనీ బ్యాడ్మింటన్ ఆడాడు. మెన్స్ డబుల్స్ లాగా ఆ మ్యాచ్ జరిగింది. మహీ నెట్ వద్దకు వచ్చి షాట్స్ ఆడాడు. నగరంలోని జెఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో ఈ మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
|
బైక్పై షికారు:
ధోనీ బ్యాడ్మింటన్ ఆడడమే కాదు.. తనకెంతో ఇష్టమైన బైక్ రైడ్కు కూడా వెళ్లాడు. రాంచి వీధుల్లో హెల్మెట్ పెట్టుకుని బైక్పై షికార్లు చేసాడు. ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మహీ ఆగగా.. ఫాన్స్ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అందుకు మాజీ కెప్టెన్ కూడా సహకరించాడు. ఇక బైక్పై వెళుతున్న సమయంలో మహీని గుర్తు పట్టిన అభిమానులు అతన్ని చుట్టుముట్టి సెల్ఫీలు దిగారు. దీంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబందించిన వీడియో కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ధోనీకి కరోనా భయం లేదా? అని ఫాన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
వీడ్కోలు కార్యక్రమం
ధోనీ రాంచీకి బయలుదేరేముందు చెన్నై జట్టు యాజమాన్యం అతనికి చిన్న వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిదంబరం స్టేడియంలో అభిమానులతో కాసేపు సరదాగా గడిపాడు. కొందరికి ఆటోగ్రాఫ్లు ఇచ్చి ఫొటోలు దిగాడు. ఓ చిన్నారి అభిమానికి తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. మహీ బారికేడ్ దగ్గరికి వెళ్లి మరీ ఓపికగా తన అభిమానులందరికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆపై వారితో కాసేపు ముచ్చటించాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ ట్విటర్లో పోస్టు చేసింది. 'తలా.. మళ్లీ చెన్నైకు రావాలంటే ఐపీఎల్ నిర్వహణపై స్పష్టత రావాల్సిందే' అని రాసుకొచ్చింది.