గ్రౌండ్స్మెన్కు గిఫ్ట్లు ఇచ్చిన ధోని
కాగా, ఆదివారం పంజాబ్తో మ్యాచ్ అనంతరం ధోని గ్రౌండ్స్మెన్కు గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. చెన్నై జట్టు తరపున మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) గ్రౌండ్స్మెన్ ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున కానుకగా అందజేశారు. దీంతో పాటు ఐపీఎల్ ఆరంభంలో వారితో దిగిన ఫొటోలను ఫ్రేమ్ కట్టించి బహుమతిగా అందించారు.
ఆనందం వ్యక్తం చేసిన పూణె గ్రౌండ్స్మెన్
ధోనికి తమకు బహుమతులు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని గ్రౌండ్స్మెన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒకే ఒక్క మ్యాచ్ని తమ సొంత మైదానం చెపాక్లో ఆడింది. ఆనంతరం కావేరీ జలాల వివాదం నేపథ్యంలో చెన్నైలో జరగాల్సిన సీఎస్కే మ్యాచ్లను పుణేకి తరలించిన సంగతి తెలిసిందే.
'విజిల్పోడు ఎక్స్ప్రెస్' పేరిట రైలు
సొంత మైదానం నుంచి మ్యాచ్లు పూణెకు తరలివెళ్లడంతో సీఎస్కే అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా కాస్త ఒత్తిడికి గురయ్యారు. ఇక, సీఎస్కే యాజమాన్యం చెన్నై మ్యాచ్లను వీక్షించేందుకు గాను ఏకంగా చెన్నై నుంచి పూణెకు 'విజిల్పోడు ఎక్స్ప్రెస్' పేరిట రైలు సర్వీస్ వేసేలా రైల్వే శాఖతో కూడా మాట్లాడింది.
5 మ్యాచుల్లో నాలుగింటిలో చెన్నై విజయం
ఇదిలా ఉంటే సీఎస్కే తరపున ఈ సీజన్లో చెన్నై మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం సిబ్బంది సీఎస్కే ఆటగాళ్లకు సొంత మైదానంలో ఆడుతున్న అనుభూతి కలిగించేందుకు పిచ్ రూపకల్పనలో జాగ్రత్త వహించింది. దీంతో ఇక్కడ జరిగిన 5 మ్యాచుల్లో నాలుగింటిలో చెన్నై విజయం సాధించింది. దీంతో చెన్నై విజయాల్లో గ్రౌండ్స్మెన్ కీలక పాత్ర పోషించారన్న సీఎస్కే యాజమాన్య ప్రతినిధి వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నామని.. అందుకే ధోని చేత బహుతులు అందజేసామని తెలిపారు.