టీమిండియాలో చోటు దక్కించుకుంటా
ఐపీఎల్కి ముందు జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా రాణించడంతో భారత్-ఏ జట్టులోకి ఎంపికవుతాడని అంతా భావించారు. కానీ, సెలక్టర్లు అతడికి మొండి చేయి చూపారు. తాజాగా, ఇషాన్ కిషన్ మాట్లాడుతూ భవిష్యత్లో టీమిండియాలో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
నన్ను బాధించింది
'భారత-ఎ జట్టులోకి ఎంపిక చేయకపోవడం నన్ను బాధించింది. ఎందుకంటే నేను విజయ్ హజారే ట్రోఫీ, ఐపీఎల్లో చాలా పరుగులు చేశాను. అందుకే తప్పకుండా సెలక్ట్ అవుతానని ఆశించాను. కానీ.. సెలక్టర్లు అలా ఆలోచించలేదు.. ఈ విషయంలో వారిని నేను ఒప్పించలేను కూడా. ఇప్పుడు నేను చేయాల్సింది ఒక్కటే.. నా ఆటకి మరింత మెరుగులు దిద్దుకోవడం' అని అన్నాడు.
ఏదో ఒకరోజు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తా
'నాకు తెలుసు, నేను ఏదో ఒకరోజు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తా. ఆ విషయంలో నేను వంద శాతం స్పష్టతతో ఉన్నా. ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు అన్ని పరిస్థితుల్లో సత్తాచాటేందుకు సిద్ధంగా ఉండాలి. మీ స్థానంలో మీరు బ్యాటింగ్ చేయలేనని తర్వాత చెప్పలేరు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలపై ధోని భాయ్తో మాట్లాడాను' అని కిషన్ తెలిపాడు.
మానసికంగా ధైర్యంగా ఉండాలని ధోని సూచించాడు
'మెరుగ్గా ఆడినా.. ఫెయిల్ అయినా.. మానసికంగా ధైర్యంగా ఉండాలని, ఒక మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసిన తరువాత రిలాక్స్ కాకూడదని, అదే తీవ్రతను తరువాత కూడా కొనసాగించాలని ధోని సూచించాడు' ఇషాన్ కిషన్ వెల్లడించాడు. ఇషాన్ కిషన్ కూడా ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్ కావడం విశేషం.