న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KS Bharat: ‌లాస్ట్ బాల్ సిక్స్ మహిమ! ఐపీఎల్ మెగా వేలం ముంగిట గ్యాప్ లేకుండా బాదుతున్న తెలుగు కుర్రాడు!

 KS Bharat smashes second successive century in Vijay Hazare Trophy

థానా: ఐపీఎల్ 2021 సీజన్‌లో లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టి గెలిపించనప్పుడు వచ్చిన ఆత్మవిశ్వాసమో ఏమో కానీ తెలుగు కుర్రాడు, ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్ దుమ్మురేపుతున్నాడు. మొన్ననే హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అజేయ సెంచరీ బాదిన భరత్.. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోను శతకం బాదాడు. తనదైన బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్సర్లతో 156 పరుగులతో వీరవిహారం చేశాడు. సూపర్ బ్యాటింగ్‌తో ఐపీఎల్ 2022 మెగా వేలం ముంగిట ఫ్రాంచైజీల దృష్టి మరల్చకుండా చెలరేగుతున్నాడు. భరత్ ధాటికి ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 81 పరుగుల భారీ తేడాతో గుజరాత్‌ను చిత్తు చేసింది.

 కేస్ భరత్ సెంచరీతో..

కేస్ భరత్ సెంచరీతో..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా జట్టు.. కెప్టెన్‌ భరత్‌ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అతనికి తోడుగా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. భరత్ తర్వాత టెయిలండర్ గిరి నాథ్‌రెడ్డి(34) టాప్ స్కోరర్‌గా నిలవగా..ఇతర బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు(5) సైతం నిరాశపరిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్‌ ఆంధ్ర బౌలర్ల ధాటికి 172 పరుగులకే కుప్పకూలింది. మనీష్ 4 వికెట్లతో చెలరేగి గుజరాత్ పతనాన్ని శాసించాడు.

హిమాచల్‌తో సైతం..

హిమాచల్‌తో సైతం..

హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 109 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్‌లతో భరత్ అజేయంగా 161 పరుగులు చేశాడు. తనదైన బ్యాటింగ్‌తో హిమాచల్ బౌలర్లను చితక్కొట్టాడు. దాంతో ఆ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు చేసింది. కేఎస్ భరత్‌తో పాటు అశ్విన్ హెబ్బర్(132 బంతుల్లో 10 ఫోర్లతో 100) సెంచరీతో రాణించాడు. చివర్లో అంబటి రాయుడు (14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) విలువైన పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్.. 46 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిషీ ధావన్(79) మినహా అంతా విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లో గిరినాథ్ రెడ్డి 4 వికెట్లతో రాణించాడు.

 చెలరేగుతున్న ఐపీఎల్ స్టార్లు..

చెలరేగుతున్న ఐపీఎల్ స్టార్లు..

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన భరత్ 2 సెంచరీల సాయంతో 370 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో రుతురాజ్(5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 603 పరుగులు), భరత్‌తో పాటు మరో ఐపీఎల్‌ స్టార్‌ వెంకటేశ్‌ అయ్యర్‌(5 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 349 పరుగులు) కూడా రాణిస్తున్నారు. ఈ ఇద్దరు భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. సౌతాఫ్రికా పర్యటనలో భారత్ ఆడే మూడు వన్డేల సిరీస్‌లో చోటు దక్కించుకోనున్నారు.

 లాస్ట్ బాల్ సిక్స్‌తో..

లాస్ట్ బాల్ సిక్స్‌తో..

గత ఐపీఎల్‌ వేలంలో కనీస ధర రూ.20 లక్షలు మాత్రమే పలికిన భరత్‌(ఆర్సీబీ).. తాజా ప్రదర్శనతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో జాక్‌పాట్ కొట్టనున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడే అవకాశాన్ని అందుకున్న భరత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రసవత్తర పోరులో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టుకు విజయాన్నందించాడు. ఆ ఒక్క మ్యాచ్‌తో హీరోగా మారిపోయాడు. వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మెన్‌ అయిన భరత్‌.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో సాహా గైర్హాజరీలో టీమిండియా తాత్కాలిక వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మెగా వేలంలో అతను భారీ ధర పలికే అవకాశం ఉంది.

Story first published: Tuesday, December 14, 2021, 21:26 [IST]
Other articles published on Dec 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X