కోహ్లీని ఔట్ చేసినప్పుడు
ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో విరాట్ కోహ్లీని ఔట్ చేసినప్పుడు విలియమ్స్ జేబులోంచి బుక్ తీసినట్లు చూపిస్తూ టిక్కు కొట్టి కవ్వించాడు. దానిని దృష్టిలో ఉంచుకుని తొలి టీ20లో విలియమ్స్ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లి నేరుగా బౌండరీకి తరలించాడు.
నోటిపై వేలు వేసుకున్న విలియమ్స్
ఆ తర్వాతి బంతిని లాంగాన్లో కళ్లు చెదిరే సిక్సర్గా మలిచాడు. సిక్సర్ కొట్టిన తర్వాత కోహ్లీ అదే నోట్బుక్ స్టయిల్లో ఆ మూమెంట్ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్బుక్ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీంతో రెండో టీ20లో కోహ్లీ వికెట్ను విలియమ్సే తీసినప్పటికీ తనదైన శైలిలో సంబరాలు చేసుకోకుండా నోటిపై వేలు వేసుకున్నాడు.
8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి
ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు రెండో మ్యాచ్లో ఓటమి తప్పలేదు. ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా టీమిండియాకు ఓటమి తప్పలేదు. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకో 9 బంతులుండగానే ఛేదించింది.
లెండిల్ సిమన్స్ 67 నాటౌట్
లెండిల్ సిమన్స్ (67 నాటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన సిమన్స్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ లూయిస్ (40; 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు)తో కలిసి అతను తొలి వికెట్కు 73 పరుగులు జోడించాడు.
బుధవారం ముంబైలో మూడో టీ20
ఆ తర్వాత హెట్మయర్ (23) అతడికి తోడుగా నిలిచాడు. రెండో వికెట్ పడ్డాక సిమన్స్తో కలిసి పూరన్ (38 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. శివమ్ దూబె (54; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మూడో టీ20 బుధవారం ముంబైలో జరగనుంది.