న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఆడిన కత్రినా: కోహ్లీకి ఓ మాట చెప్పవా అంటూ అనుష్కను ట్యాగ్ చేసింది

Katrina Kaif wants Anushka Sharma to put in a good word for her to Virat Kohli

హైదరాబాద్: నిత్యం సినిమాల‌తో బిజీగా ఉండే బాలీవుడ్ నటి క‌త్రినా కైఫ్ గ్రౌండ్‌లో అడుగుపెట్టింది. అంతేనా.. క్రికెట్ బ్యాట్ చేత బట్టి బౌండరీల మీద బౌండరీలు బాదింది. గ్రౌండ్‌లో ఉన్నవాళ్లంద‌రు క‌త్రినా బ్యాటింగ్ తీరు చూసి మురిసిపోయారు. ప్రస్తుతం కత్రినాకైఫ్ 'భారత్' సినిమా నటిస్తోంది.

<strong>తొలి ఆటగాడిగా చరిత్ర: స్మిత్‌పై ఏడాది నిషేధం కోహ్లీకి కలిసొచ్చింది</strong>తొలి ఆటగాడిగా చరిత్ర: స్మిత్‌పై ఏడాది నిషేధం కోహ్లీకి కలిసొచ్చింది

ఈ సినిమా సెట్స్‌లో షూటింగ్ ముగిశాక కత్రినా కైఫ్ క్రికెట్ ఆడిన వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన స్నేహితురాలు అనుష్క శర్మని కోరింది. "వరల్డ్ కప్ దగ్గరకొస్తోంది. నా గురించి మీ ఆయనకు ఓ మాట చెప్పవా..! నా ఆటతీరు కొంచెం మెరుగుపర్చుకోవాలి. నేను మరీ అంత బ్యాడ్ ఆల్‌రౌండర్‌నేం కాదు" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టి అనుష్కను ట్యాగ్ చేసింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కత్రినా వీడియోకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా ముగ్ధురాలైంది. "వావ్ బేబీ, మేం నిన్ను తీసుకుంటాం" అని కామెంట్ పెట్టగా.. "ప్లీజ్ కనీసం మీ జట్టులోకి తీసుకొండి, నన్ను క్రికెట్ ఆడనివ్వండి' అంటూ కత్రినాకైఫ్ బదులిచ్చింది.

ఇటీవలే కత్రినా, అనుష్క శర్మ కలిసి నటించిన 'జీరో' సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

View this post on Instagram

🌟लंच ब्रेक #bharat

A post shared by Katrina Kaif (@katrinakaif) on

Story first published: Tuesday, January 22, 2019, 17:57 [IST]
Other articles published on Jan 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X