మూడో టీ20లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ
తాజాగా మూడో టీ20లో హాఫ్ సెంచరీతో కేన్ విలియమ్సన్ కోహ్లీ, డుప్లెసిస్లను అధిగమించాడు. కెప్టెన్గా విరాట్ కోహ్లీ 36 మ్యాచ్ల్లో 8 హాఫ్ సెంచరీలు చేయగా... డుప్లెసిస్ 40 మ్యాచ్ల్లో 7 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు కూడా ఈ ముగ్గురే కావడం విశేషం.
అగ్రస్థానంలో డుప్లెసిస్
ఈ జాబితాలో డుప్లెసిస్(1273) పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.... కేన్ విలియమ్సన్(1243) రెండో స్థానంలో.... విరాట్ కోహ్లీ(1126) పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సొంతగడ్డపై జరుగుతున్న ఐదు టీ20ల సిరిస్ను కేన్ నాయకత్వంలోని కివీస్ 3-0తో చేజార్చుకుంది.
కివీస్ గడ్డపై టీ20 సిరిస్ నెగ్గిన తొలి భారత కెప్టెన్గా కోహ్లీ
ఫలితంగా కివీస్ గడ్డపై టీ20 సిరిస్ నెగ్గిన తొలి భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మూడో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో ఐదు టీ20ల సిరిస్లో మరో రెండు మ్యాచ్లు ఉండగానే సిరీస్ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది. కివీస్ గడ్డపై టీమిండియాకు ఇదే తొలి టీ20 సిరిస్ కావడం విశేషం.
చివరి వరకు ఉత్కంఠ
చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20లో మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్ నిర్ణయించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 17 పరుగులు చేయగా... అనంతరం భారత జట్టులో రోహిత్ శర్మ రెండు సిక్సులతో చెలరేగడంతో భారత్ 20 పరుగులు చేసి విజయం సాధించింది.
ఐదు మ్యాచ్ల్లో కివీస్ ఓటమి
ఫలితంగా న్యూజిలాండ్ సూపర్ ఓవర్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదింట ఓడిపోయింది. ఈ ఐదు మ్యాచ్ల్లో నాలుగు సార్లు కివీస్ పేసర్ టిమ్ సౌథీతో సూపర్ ఓవర్ వేయించడం విశేషం. మరోవైపు టీమిండియా సూపర్ ఓవర్ ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది.