నాలుగో వికెట్కు 75 పరుగుల భాగస్వామ్యం
ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(63), అజ్యింకె రహానే(18) పరుగులతో ఉన్నారు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ అనంతరం కొద్దిసేపటికే వెలుతురు లేకపోవడంతో అంపైర్లు తొలిరోజు ఆటను 85.1 ఓవర్ల వద్ద నిలిపివేశారు. ఇదిలా ఉంటే టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. వీరిద్దరు నాలుగో వికెట్కు 147 బంతుల్లో 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
|
మూడు వికెట్లు తీసిన రబాడ
టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడకే దక్కడం విశేషం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే రోహిత్ శర్మ ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతిని రోహిత్ శర్మ(14) డికాక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
|
పుజారా హాఫ్ సెంచరీ
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు. హాఫ్ సెంచరీ అనంతరం జట్టు స్కోరు 163 పరుగుల వద్ద పూజారా(58) రెండో వికెట్గా పెవిలియన్కు చేరాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
|
మయాంక్ అగర్వాల్ సెంచరీ
పుజారా ఔటైన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి మయాంక్ అగర్వాల్ సమయోచితంగా ఆడుతూ సెంచరీ (108) సాధించాడు. తొలి టెస్టులో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ రెండో టెస్టులోనూ సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఫిలాండర్ వేసిన ఇన్నింగ్స్ 57వ ఓవర్ మూడో బంతిని ఫోర్గా మలిచి సెంచరీ నమోదు చేశాడు.