రాజస్థాన్ జట్టుతో తలపడడం రెండోసారి:
ఆఖరి మ్యాచ్ విజయంతో ముగించిన కోల్కతా జట్టు రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. లీగ్లో రాజస్థాన్ జట్టుతో తలపడడం రెండోసారి. అయితే మొదటి సారి జరిగిన మ్యాచ్ లో కోల్కతానే గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సారి మంగళవారం తలపడేందుకు సిద్ధమైంది కోల్కతా జట్టు. అక్కడే వచ్చింది అసలు సమస్య. లీగ్ ఆరంభం నుంచి కోల్కతా జట్టు విజయం తర్వాత ఆడిన మ్యాచ్ను దాదాపు ఓడిపోతూనే ఉంది.
విజయం తర్వాత ఆడిన మ్యాచ్లో కూడా గెలవాలనే:
దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ అయిన కోల్కతా జట్టు ప్రధాన కోచ్ జాక్వెలిస్ మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 11లో మేము ఓడిన ప్రతిసారి అంతే వేగంతో విజయం దిశగా పయనిస్తున్నాం. కానీ, విజయం తర్వాత ఆడిన మ్యాచ్లో కూడా గెలవాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నానని పేర్కొన్నాడు. ఐపీఎల్11లో కోల్కతా ఈ క్రమంలోనే 1, 4, 5, 8, 9, 12 మ్యాచ్లను గెలిచి 2, 3, 6, 7, 10, 11 మ్యాచ్లలో ఓడిపోయింది.
జట్టు భవిష్యత్ ఇంకా మా చేతుల్లోనే
కోల్కతా జట్టు ప్లేఆఫ్ రేసు గురించి కోచ్ కలిస్ మాట్లాడుతూ ‘ఈ సీజన్లో జట్టు భవిష్యత్ ఇంకా మా చేతుల్లోనే ఉంది. టోర్నీలో మిగిలి ఉన్న రెండు మ్యాచ్ల్లోనూ గెలవగలిగితే ప్లేఆఫ్ చేరుతాం. ఇందులో భాగంగా తొలుత రాజస్థాన్ రాయల్స్పై మెరుగైన ప్రదర్శన కనబర్చాలి. టోర్నీలో ఇప్పటి వరకు కోల్కతా ఆటతీరుపై మాలో ఎలాంటి ఆందోళన లేదు. ఈరోజు రెండు జట్లూ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. పోరు ఉత్కంఠగా జరుగుతుంది' అని కలిస్ వెల్లడించాడు. టోర్నీలో గత మూడు మ్యాచ్ల్లోనూ రాజస్థాన్ గెలిచి ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది.
రెండు మ్యాచ్లే నిర్ణయిస్తాయని
సీజన్లో రాతని మిగిలిన రెండు మ్యాచ్లే నిర్ణయిస్తాయని ఆ జట్టు ప్రధాన కోచ్ జాక్వెస్ కలిస్ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్లాడిన కోల్కతా జట్టు ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ ఆ జట్టు తప్పక గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటలకి రాజస్థాన్ రాయల్స్తో కోల్కతా జట్టు అమితుమీకి సిద్ధమైంది.