హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా లక్షలాది లీటర్ల నీటిని వృథా చేస్తున్నారని.. 2018 ఐపీఎల్ను నిషేధించాలని కోరుతూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం, మ్యాచ్లకు వేదికలు కానున్న తొమ్మిది రాష్ట్రాలకు ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
రెండు వారాల్లోగా దీనిపై సమాధానమివ్వాలని జలవనరుల మంత్రిత్వ శాఖ, బీసీసీఐ, ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించనున్న 9 వేదికల రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్ జవాద్ రహీమ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
NGT seeks response from Government, #BCCI on plea alleging misuse of water during #IPL
— CricketNDTV (@CricketNDTV) March 14, 2018
Read: https://t.co/nYqg1Cs1Iv pic.twitter.com/KK56slKAPj
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు పిచ్లను తయారు చేసేందుకు లక్షల లీటర్ల నీటిని వృథా చేస్తారన్నది పిటిషనర్ల వాదన. ''మొత్తం 9 వేదికల్లో 51 రోజుల పాటు ఐపీఎల్-11ను ఆడతారు. పిచ్లను సిద్ధం చేయడానికి లక్షల లీటర్ల నీరు వృథా అవుతుంది. దీని వల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడుతుంది'' అని పిటిషన్లో పేర్కొన్నారు.
National Green Tribunal (NGT) notice to Centre, BCCI on the plea alleging misuse of water during IPL pic.twitter.com/cErJ1iMiXr
— TIMES NOW (@TimesNow) March 14, 2018
ఆల్వార్కు చెందిన హైదర్ అలీ అనే యువకుడు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఐపీఎల్లో పిచ్లను సిద్ధం చేయడానికి లక్షలాది లీటర్ల నీరు వృథా అవుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. నీటిని దుర్వినియోగం చేస్తూ ఈ టోర్నీలో భాగస్వామ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపార ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీని వెంటనే నిలిపేయాలని కోరారు. గత ఐపీఎల్లో మహారాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడటంతో కొన్ని మ్యాచ్ల వేదికలను తరలించిన విషయం తెలిసిందే.
NGT issues notices to BCCI and nine States on allegations of possible water misuse in upcoming IPL matches. #IPLhttps://t.co/Di72YAEg0i
— The Hindu - Sports (@TheHinduSports) March 15, 2018