పరాజయాల పరంపర..
గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఐపీఎల్ సీజన్లో ఘోర పరాజయాలు చెన్నైని ఇంకా వెంటాడుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్లో ఓటమి చవి చూసింది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 221 పరుగుల రికార్డ్ స్కోర్ చేసిన పంజాబ్ కింగ్స్ను ధోనీ సేన ఎదుర్కొనబోతోంది. ఈ సీజన్లో ఈ రెండు జట్లూ తలపడటం ఇదే తొలిసారి. రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో సూపర్ కింగ్స్.. తమ జోరును కొనసాగించాలనే కసితో కేఎల్ రాహుల్ టీమ్ ఉన్నాయి.
ధోనీ మెడపై కత్తి..
దీనికి అదనంగా మహేంంద్ర సింగ్ ధోనీ మెడపై నిషేధపు కత్తి వేలాడుతోంది. ఈ మ్యాచ్ తరువాత.. ధోనీ భవితవ్యం ఏమిటనేది తేలిపోతుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ధోనీపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్లో స్లోయర్ రన్రేట్ కారణంగా ధోనీపై ఇప్పటికే 12 లక్షల రూపాయల జరిమానా పడింది. స్లోయర్ రన్ రేట్ కారణంగా ఈ మొత్తాన్ని అతను చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. వాంఖెడే మైదానంలో పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లో ధోనీ గనక మరోసారి స్లోయర్ రన్రేట్ను నిషేధం తప్పకపోవచ్చు.
మరో పొరపాటు జరిగితే..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రూపొందించిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం.. ఏ జట్టయినా 90 నిమిషాల వ్యవధిలో 20 ఓవర్ల ఓటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. అది నిబంధన. దీన్ని ఉల్లంఘించిన జట్టు కేప్టెన్పై జరిమానాలను కొరడాను ఝుళిపిస్తుంది బీసీసీఐ. తొలి తప్పు కింద భారీగా జరిమానాను విధిస్తుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇదే సమస్యను ఎదుర్కొంది.
స్లోయర్ రన్రేట్ కారణంగా ధోనీ 12 లక్షల రూపాయల మొత్తాన్ని జరిమానాగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి మరో రెండు మ్యాచుల్లో గనక ఎదురైతే.. కేప్టెన్పై కఠిన చర్యలను తీసుకుంటుంది బీసీసీఐ. కేప్టెన్పై ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. ప్రస్తుతం ధోనీ ఈ పరిస్థితిలోనే ఉన్నాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో స్లోయర్ రన్ రేట్ నమోదైతే.. నిషేధానికి మరింత చేరువ అవుతాడు.