2018 టైటిల్ విజేతగా సీఎస్కే
ఇదే డాడీస్ ఆర్మీ 2018 సీజన్లో మిరాకిల్ చేసింది. ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, డాడీస్ ఆర్మీ ట్రెండ్ ఈ సీజన్లోనూ కంటిన్యూ అవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన సీఎస్కే ఈ సీజన్లో అద్భుతాలు చేసింది.
వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్కు
వరుసగా రెండో సీజన్లో కూడా ఐపీఎల్ ఫైనల్కు చేరేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా క్వాలిఫయిర్-2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఇక, ఢిల్లీ విషయానికి వస్తే యువ ఆటగాళ్లతో కలకలలాడుతోంది. ఈ సీజన్లో యువ క్రికెటర్లు పృథ్వీ షా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్లు ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు.
పాంటింగ్ కోచింగ్, గంగూలీ సలహాలు
పాంటింగ్ కోచింగ్, గంగూలీ సలహాలతో నిర్భయంగా, నమ్మశక్యం కాని రీతిలో షాట్లు ఆడుతున్నారు. కుర్రాళ్లతో నిండిన దిల్లీ ఉత్సాహంతో ఉంది. ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్ పై గెలిచిన ఆ జట్టు మరింత ఆత్మవిశ్వాసంతో క్వాలిఫయిర్-2 మ్యాచ్లో బరిలోకి దిగుతోంది. ఎలిమినేటర్లో 21 బంతుల్లోనే 49 పరుగులు చేసి పంత్ ఫామ్లో ఉన్నాడు.
పూర్తి ఫినిషింగ్కు పంత్
అయితే, పంత్ పూర్తిస్థాయిలో మ్యాచ్ను ఫినిష్ చేయాలని అటు అభిమానులతో పాటు ఢిల్లీ యాజమాన్యం కోరుకుంటోంది. మరో యువ బ్యాట్స్మన్ పృథ్వీ షాతో పాటు శిఖర్ ధావన్ కూడా ఫామ్లో ఉండడం ఆ జట్టుకు సంతోషానిస్తోంది. మిడిలార్డర్లో అయ్యర్, మన్రోలతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.
చరిత్ర సృష్టించాలని ఢిల్లీ
కాగా, గాయం కారణంగా ఐపీఎల్కు దూరమైన సఫారీ బౌలర్ కగిసో రబాడ స్థానంలో ట్రెంట్ బౌల్ట్, ఇషాంత్ శర్మ రాణిస్తుండటం... వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అనుభవం జట్టుకు తోడవడం మొత్తంగా ఈ మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్కు చేరుకుని చరిత్ర సృష్టించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఊవిళ్లూరుతోంది.