న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్‌లో గెలిచేదెవరు?: పాక్‌కే గెలిచే ఛాన్స్‌లెక్కువ!

Indian cricketers term Pakistan favourite team in Asia Cup

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుకే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గాయి. తొలి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు హాంకాంగ్‌పై విజయం సాధించాయి.

భారత్ Vs పాక్: ఆసియా కప్‌‌లో ఎవరెన్ని వన్డేలు గెలిచారో తెలుసా?భారత్ Vs పాక్: ఆసియా కప్‌‌లో ఎవరెన్ని వన్డేలు గెలిచారో తెలుసా?

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గ్రూప్-ఏలో టాపర్‌గా నిలవాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ "మొట్టమొదటిసారి, దాయాదుల పోరులో భారత్ జట్టు ఫేవరెట్ కాదని నాకు అనిపిస్తోంది. మన జట్టుతో పోలిస్తే పాకిస్థాన్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది" అని అన్నాడు.

"అంత మాత్రాన ఆ జట్టే గెలుస్తుందని నేను చెప్పడం లేదు. కానీ, భారత్‌‌తో పోలిస్తే పాక్‌కే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ టోర్నీలో విరామం లేకుండా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడబోతోంది. భారత జట్టులో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో పాక్‌‌ బలం మరింత పెరిగింది" అని అగార్కర్ వెల్లడించాడు.

భారత్ Vs పాక్ మ్యాచ్: ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఆటగాళ్లు ఇలా!భారత్ Vs పాక్ మ్యాచ్: ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఆటగాళ్లు ఇలా!

కాగా, టోర్నీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్‌‌ను 37.1 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూల్చిన పాక్ అనంతరం లక్ష్యాన్ని 23.4 ఓవర్లలో 120/2తో అలవోకగా చేధించింది. కానీ, మంగళవారం అదే హాంకాంగ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు అతికష్టంగా 26 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (120 బంతుల్లో 127; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 14వ సెంచరీతో చెలరేగగా, అంబటి రాయుడు (70 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించారు.

అనంతరం 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ 240/3తో దాదాపు ఛేదించేసేలా కనిపించింది. కానీ చివర్లో భారత బౌలర్లు పుంజుకుని ఆ జట్టుని 259/8కి పరిమితం చేయడంతో 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

Story first published: Wednesday, September 19, 2018, 15:50 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X