చీకట్లో మా వికెట్లు తీశారు:
డుప్లెసిస్ మాట్లాడుతూ... 'ప్రతి టెస్టు మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచేది. తొలుత బ్యాటింగ్ చేసి 500లకు పైగా పరుగులు సాధించేది. చీకటి పడుతుండగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. చీకట్లో మమ్మల్ని బ్యాటింగ్కు ఆహ్వానించి మూడు వికెట్లు పడగొట్టేది. దీంతో మూడో రోజు ఆట ఒత్తిడితో మేము కొనసాగించాల్సి వచ్చేది. ప్రతి టెస్టులోనూ ఇదే తంతు. కాపీ, పేస్ట్లా సాగిపోయింది' అని అన్నాడు.
మాజీల సహాయం అవసరం:
'ఆతిధ్య జట్టు టాస్ గెలవపోతే పర్యాటక జట్టుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. దక్షిణాఫ్రికాలో అంతే. మేము పచ్చిక మైదానంలో కూడా బ్యాటింగ్ చేయగలం. భారత్తో జరిగిన ఆఖరి టెస్టును గొప్పగా ప్రారంభించాం. కానీ.. తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యాం. ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెట్కు మాజీల సహాయం ఎంతో అవసరం. ఖర్చు ఎక్కువైనా మాజీ క్రికెటర్ల సేవలను ఉపయోగించుకోవాలి' అని డుప్లెసిస్ ఓ స్పోర్ట్స్ చానెల్లో వ్యాఖ్యానించాడు.
దక్షిణాఫ్రికా ఎప్పటికీ తేరుకోలేదు:
డుప్లెసిస్ వ్యాఖ్యలపై భారత అభిమానులు ట్విటర్లో మండిపడుతున్నారు. 'ఓటమికి సిల్లీ కారణాలు చెప్పకుండా గెలవడానికి ప్రయత్నించు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'ఇలాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తి జట్టుకు కెప్టెన్గా ఉంటే దక్షిణాఫ్రికా ఎప్పటికీ తేరుకోలేదు అని మరో అభిమాని కామెంట్ చేసాడు. 'జట్టులో సీనియర్ ఆటగాడిగా ఉన్న నువ్వు.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి నీపై ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటున్నావు' అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డుప్లెసిస్ మారడు:
'డుప్లెసిస్ మాటలు కోపం తెప్పించేవిగా ఉన్నాయి. అతన్ని తిట్టాలనుంది. కానీ.. సీఎస్కే ఆటగాడు కదా అని వదిలేస్తున్నా', 'డుప్లెసిస్ చెప్పే సాకులు భయంకరంగా ఉన్నాయి', 'డుప్లెసిస్ను వదిలేద్దాం అనుకుంటే పొరబాటే. అతను మారడు', ''డుప్లెసిస్ను వదిలేయకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుందాం', 'చిన్నపిల్లల మనస్తత్వం. కాపీ పేస్ట్లా మ్యాచ్లు సాగాయట' అని కామెంట్లు చేస్తున్నారు.