|
స్టాండ్కు కోహ్లీ పేరు:
'ఆగస్టు 18, 2008న డిల్లీ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికి 11 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇన్నేళ్ళలో అతడు క్రికెట్ లెజెండ్గా మారాడు. కోహ్లీ ప్రదర్శన డీడీసీఎకు గర్వంగా ఉంది. ఆటగాడిగా, కెప్టెన్గా ఎన్నో రికార్డులను అందుకున్నందుకు ఫిరోజ్షా కోట్ల మైదానంలోని ఓ స్టాండ్కు కోహ్లీ పేరును పెట్టాలని నిర్ణయించుకున్నాం' అని డీడీసీఎ ట్వీట్ చేసింది.
కోహ్లీ జ్ఞాపకార్థంగా:
'ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ ప్రదర్శన గర్వించదగినది. అతని ఆటతో డీడీసీఎ ఎంతో గర్వంగా ఉంది. కెరీర్లో ఆటగాడిగా, కెప్టెన్గా ఎన్నో రికార్డులను అందుకున్న కోహ్లీని గౌరవించడం సంతోషంగా ఉంది. కోహ్లీ జ్ఞాపకార్థంగా డీడీసీఎ తన పేరు మీద ఒక స్టాండ్ని అంకితం చేయాలనుకుంది. ఢిల్లీ యువ క్రికెటర్లకు ‘కోహ్లీ స్టాండ్' ఎంతో స్ఫూర్తినిస్తుందని డీడీసీఎ అధ్యక్షుడు రజత్ శర్మ పేర్కొన్నారు. 'కోహ్లీ మాత్రమే కాదు ఓపెనింగ్ బ్యాట్స్మన్, వికెట్ కీపర్, ఫాస్ట్ బౌలర్లు కూడా భారత జట్టులో ఢిల్లీ నుండి ఉండడం మాకు సంతోషం' అని ఆయన పేర్కొన్నారు.
|
మాజీలు ఆటగాళ్లకు కూడా:
మాజీలు ఆటగాళ్లు బిషన్ సింగ్ బేడీ, మొహిందర్ అమర్నాథ్, వీరేంద్ర సెహ్వాగ్లకు కూడా ఫిరోజ్షా కోట్ల మైదానంలో స్టాండ్లు ఉన్నాయి. వీరందరూ రిటైర్మెంట్ తర్వాత ఆయా స్టాండ్లకు వారి పేర్లు పెట్టారు. కానీ విరాట్ కోహ్లీ ఆటలో కొనసాగుతుండగానే.. డీడీసీఎ ఫిరోజ్షా కోట్ల మైదానంలోని ఓ స్టాండ్కు పేరు పెట్టింది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న పిన్న వయసు క్రికెటర్గా కోహ్లీ అరుదైన ఘనతను అందుకోనున్నాడు.