పాకిస్థాన్తో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం:
టోర్నీలో చాలా మ్యాచ్లు అంచనాలకు అందని రీతిలో సాగిన నేపథ్యంలో రోహిత్ సేన అప్రమత్తంగా ఉండాల్సిందే. అందులోనూ పాకిస్థాన్ ఆట ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. రెండు జట్లూ ఒక్కో మ్యాచ్ గెలిచాయి కాబట్టి ఆదివారం నెగ్గే జట్టు దాదాపుగా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంటుంది. భారత్కు నెట్ రన్రేట్ కూడా చాలా బాగుంది కాబట్టి పాక్ను మామూలుగా ఓడించినా ఫైనల్కు చేరిపోయినట్లే. పాకిస్థాన్తో మ్యాచ్కు భారత తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.
అదనపు బ్యాట్స్మన్గా మనీష్ పాండేను
పాక్తో గ్రూప్ దశ మ్యాచ్లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడటంతో.. బంగ్లాపై అతడి స్థానంలో జడేజాను ఆడించారు. 14 నెలల తర్వాత వన్డే తుది జట్టులోకి వచ్చిన అతను అద్భుత ప్రదర్శన చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గెలిచాడు. దీంతో అతడిని కొనసాగించక తప్పదు. మరి గత మ్యాచ్ మాదిరే ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తారా.. లేక చాహల్, కుల్దీప్ల్లో ఒకరిని పక్కన పెట్టి మూడో పేసర్ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరం. ఒక స్పిన్నర్ను తగ్గించుకుని అదనపు బ్యాట్స్మన్గా మనీష్ పాండేను ఎంచుకునే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం.
ఒత్తిడంతా పాక్ పైనే..:
కీలక పోరులో మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఫహీమ్ అష్రాఫ్ స్థానంలో హరీస్ సొహైల్, షాదాబ్ ఖాన్ స్థానంలో మొహమ్మద్ నవాజ్ వచ్చే అవకాశాలున్నాయి. జట్టు బ్యాటింగ్కు షోయబ్ మాలిక్ వెన్నెముకలా ఉంటున్నాడు. ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ తమ స్థాయి ఆటను ప్రదర్శిస్తున్నా ఫఖర్ జమాన్ వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ కావడం ఆ జట్టును ఆందోళనపరుస్తోంది. పాక్ ప్రధాన బౌలర్ మొహ్మద్ అమీర్ పేలవ ఫామ్ పాక్ను దెబ్బతీస్తోంది. అందుకే అతడు అఫ్ఘాన్తో మ్యాచ్లో చోటు కోల్పోవాల్సి వచ్చింది. భారత్పై గెలవాలంటే పేసర్లు హసన్ అలీ, ఉస్మాన్ ఖాన్ రాణించాల్సి ఉంటుంది.
జట్లు (అంచనా), పిచ్ స్వభావం:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్ర్పీత్ బుమ్రా.
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫహీమ్ అష్రా్ఫ/హరీస్ సొహైల్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్/మొహమ్మద్ నవాజ్, హసన్ అలీ, ఉస్మాన్ ఖాన్, షహీన్ అఫ్రీది/మహ్మద్ ఆమెర్.
పిచ్ వాతావరణ పరిస్థితి:
ఇక్కడ ఉపయోగించిన రెండు పిచ్లు నెమ్మదిగానే ఉన్నాయి. భారీ స్కోర్లు కష్టమే కాబట్టి 250కి పైగా పరుగులు చేస్తే పోటీ ఇవ్వవచ్చు. స్పిన్నర్లు రాణించే అవకాశముంది.