18 రోజుల విరామం పాండ్యా ట్వీట్
సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే హార్దిక్ పాండ్యా 18 రోజుల విరామం తర్వాత ట్వీట్ చేయడం గమనార్హం. కాగా, మూడో వన్డేలో హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకుని 45 పరుగులు ఇచ్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు.
కోహ్లీ మాట్లాడుతూ
కోహ్లీ మాట్లాడుతూ "పాండ్యా తిరిగి జట్టులో చూడటం సంతోషంగా ఉంది. తల తిప్పకుండా వికెట్ మీదే దృష్టి పెట్టి పాండ్యా బౌలింగ్ చేశాడు. పాండ్యా బౌలింగ్ చేసిన విధానం చూస్తే అతనెంత ఫోకస్ చేశాడో అర్థమవుతుంది. పది ఓవర్లు వేసిన పాండ్యా 2 వికెట్లు తీసుకుని 45 రన్స్ ఇచ్చాడు. జట్టు తరపున కీలక పాత్ర పోషించే ప్లేయర్. పాండ్యాతో తుది జట్టులో బ్యాలెన్స్ వచ్చింది" అని కోహ్లీ అన్నాడు.
గవాస్కర్ సైతం పొగడ్తలు
మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా హార్దిక్ పాండ్యాను పొగడ్తల్లో ముంచెత్తాడు. మూడో వన్డేలో అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు. వివాదాలను మర్చిపోయి మైదానంలో ఆటపై దృష్టి పెట్టడం మామూలు విషయం కాదన్నాడు. దేశం కోసం ఆడుతున్నామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని గవాస్కర్ సూచించాడు.