2010లో దంబుల్లా వేదికగా
అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్(88) పైనే ఈ రికార్డు ఉండటం విశేషం. ఇక, ఇప్పటివరకు శ్రీలంక(2000)పై 54 పరుగులే ఇప్పటివరకు అత్యల్ప స్కోరు కావడం విశేషం. భారత జట్టులో ఆరుగురు బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్కే పరిమితమవగా.. ఇందులో ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డకౌట్గా వెనుదిరిగారు.
టాప్ స్కోరర్గా యజువేంద్ర చాహల్
చివర్లో బ్యాట్తో రాణించిన చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (18 నాటౌట్: 37 బంతుల్లో 3 ఫోర్లు)తో టాప్ స్కోరర్గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా, తొడ కండరాల గాయం కారణంగా ధోని ఈ మ్యాచ్కి దూరమైన సంగతి తెలిసిందే. 2010 తర్వాత టీమిండియా 100 పరుగులలోపే వన్డేలో కుప్పకూలడం ఇదే తొలిసారి.
తక్కువ స్కోరుకి ఆలౌటైన మ్యాచ్లు
సుదీర్ఘ వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు తక్కువ స్కోరుకి ఆలౌటైన మ్యాచ్లను ఓసారి పరిశీలిస్తే..!
* 54 vs Sri Lanka in Sharjah (2000)
* 63 vs Australia in Sydney (1981)
* 78 VS Sri Lanka in Kanpu (1986)
* 79 vs Pakistan in Sialkot (1978)
* 88 vs New Zealand Dambulla (2010)
* 91 vs South Africa in Durban (2006)
* 100 vs Australia in Sydney (2000)
* 100 vs West Indies in Ahemedabad (1993)
* 103 vs Sri Lanka in Dambulla (2010)
* 103 vs Sri Lanka in Colombo (2008)