మోచేతి గాయంతో:
టీమిండియాతో అహ్మదాబాద్ వేదికగా గత శనివారం ముగిసిన చివరిదైన నాలుగో టెస్టుకీ మోచేతి గాయంతోనే జోప్రా ఆర్చర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్ కూడా ఆడలేదు. గాయం ఇంకా తగ్గకపోవడంతో టీ20 సిరీస్లోనూ అతను ఆడటంపై పలు సందేహాలు నెలకొన్నాయి. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే.. ఐపీఎల్ 2021లో కూడా ఆర్చర్ ఆడడం అనుమానమే. రాజస్థాన్ జట్టుకు ఆర్చర్ ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమ్ మెడికల్ స్టాఫ్ ఆర్చర్ గాయాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చీఫ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ ఓ ప్రకటనలో తెలిపాడు. త్వరలోనే ఆర్చర్ గాయం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు.
సర్జరీ వాయిదా:
నిజానికి జోప్రా ఆర్చర్ తన మోచేతి గాయానికి సర్జరీ చేయించుకోవాలని ఆశించాడు. కానీ ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు జరగనుండగా.. ఆ తర్వాత అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్ ఉంది. ఆ వెంటనే ఇంగ్లీష్ జట్టుకు కీలకమైన యాషెస్ సిరీస్ జరగనుండటంతో సర్జరీని వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే.. ఓ ఫాస్ట్ బౌలర్ సర్జరీ తర్వాత కొన్ని నెలలు ఆటకి అతను దూరంగా ఉండాల్సి ఉంటుంది. మార్చి 12 నుంచి 20 వరకూ ఐదు టీ20లు, మార్చి 26 నుంచి మూడు వన్డేల సిరీస్లో భారత్తో ఇంగ్లండ్ తలపడనుంది.
బౌలింగ్తోనే కాదు:
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన బౌలింగ్తోనే కాదు ట్వీట్ల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆర్చర్ ఎప్పుడో చెప్పింది వాస్తవ రూపం దాల్చడంతో అతని ట్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్లో ఏది జరిగినా.. ఆర్చర్ ముందే చెప్పాడనే ట్వీట్ మన ముందు నిలుస్తూ ఉంటుంది. అయితే అందులో వాస్తవం ఎంతనేది మాత్రం ఆర్చర్కే తెలియాలి. నిజంగానే ఆర్చర్ వద్ద టైమ్ మిషీన్ ఉందా అని ప్రశ్న కూడా అభిమానులు మనసుల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. గతేడాది చివరలో అతనికి సంబందించిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు, 17 వన్డేలు, 7 టీ20లు ఆడాడు.