మ్యాచ్ గెలవలేకపోయాం
"నయీమ్(81; 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతంగా బ్యాటింగ్ చేసినా మ్యాచ్ గెలవలేకపోయాం. ఈ విషయంలో నిరాశ చెందా. మేము గెలిచి ఉంటే, ఆ క్రెడిట్ అంతా నయీమ్కు దక్కేది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయాం. కానీ నయీమ్, మిథున్(27)లు బాగా అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ 98 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు" అని ప్రశంసల వర్షం కురిపించాడు.
175 పరుగుల విజయ లక్ష్యంతో
175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు లిటన్ దాస్, సౌమ్య సర్కార్లను దీపక్ చాహర్ వరుస బంతుల్లో పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నయీమ్, మిథున్ నిలకడగా ఆడుతూ మూడో వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇలాంటి తప్పులే చేశాం
"గత మ్యాచ్లను పరిశీలిస్తే మేం ఇలాంటి తప్పులే చేశాం. పెద్ద జట్లన్నీ ఈ విభాగంలో చాలా పటిష్టంగా ఉంటాయి. నాగ్పూర్లో టార్గెట్ను ఛేదించడానికి వికెట్ చాలా బాగుంది. టీమిండియాను 174 పరుగులకు కట్టడి చేసి, మా బౌలర్లు మంచి పనిచేశారు. ఏదేమైనా, మేం చేసిన తప్పిదాలే మా ఓటమికి కారణం" అని మహ్మదుల్లా వివరించాడు.
2-1తో సిరిస్ కైవసం
పేసర్ దీపక్ చాహర్ 6 వికెట్లతో చెలరేగడంతో 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆఖరి టీ20లో 30 పరుగులతో గెలిచిన టీమిండియా మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ కూడా నమోదు చేయడం విశేషం.