సవాలుగా తీసుకుంటున్నా:
మూడో వన్డేకు ముందు శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా నా కోసం వ్యూహాలతో బరిలోకి దిగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే వారి ప్రణాళికలను సవాలుగా తీసుకుంటున్నా. ఒత్తిడిలో మరింత ప్రేరణతో గొప్పగా ఆడటానికి ప్రయత్నిస్తా. షార్ట్ లెగ్, గల్లీలో ఫీల్డర్లు ఉండటం ఎక్కువ పరుగులు సాధించడానికి వీలు ఉంటుంది. అయితే క్రీజులోకి వచ్చిన తర్వాత మొదట కుదురుకోవడానికి ప్రయత్నిస్తా. షార్ట్ బాల్స్ వేస్తే దూకుడుగా ఆడాలనుకుంటా. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న ఫీల్డింగ్.. షాట్లకు అనుకూలంగా ఉంటుంది' అని తెలిపాడు.
షాట్ను ఎంచుకునే సరికి ఆలస్యమైంది:
తొలి మ్యాచ్లో జోష్ హేజిల్వుడ్ వేసిన బౌన్సర్ను పేలవమైన షాట్ ఆడి ఔటవ్వడంపై శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. 'నాకు షార్ట్ బాల్ వేస్తారని తెలుసు. అయితే ఆ సమయంలో నా మదిలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. పుల్ షాట్ లేదా అప్పర్ కట్ ఆడాలనుకున్నా. కానీ ఓ షాట్ను ఎంచుకునే సరికి ఆలస్యమైంది. దాంతో సమర్థవంతంగా ఆడలేకపోయా' అని అన్నాడు. రెండు వన్డేలలో శ్రేయస్ 40 పరుగులే చేశాడు. తొలి వన్డేలో పేలవమైన షాట్ ఆడి రెండు పరుగులకే పెవిలియన్ చేరగా,.. రెండో మ్యాచ్లో స్మిత్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో 38 రన్స్ వద్ద వెనుదిరిగాడు.
ఇబ్బందులు తలెత్తాయి:
సిడ్నీ పిచ్తో పోలిస్తే ప్రాక్టీస్ చేసిన పిచ్ల బౌన్స్ వేరుగా ఉండటంతో పరిస్థితులకు అలవాటు పడటానికి సమయం పట్టిందని టీమిండియా యువ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. గత రెండు నెలలు ఐపీఎల్ 2020 ఆడటంతో టీ20 ఫార్మాట్ నుంచి వన్డేలకు తగ్గట్లుగా మారడానికి కాస్త ఇబ్బందులు తలెత్తాయని చెప్పాడు. ఇక మూడో వన్డే మ్యాచ్లో బలంగా పుంజుకుని బరిలోకి దిగుతామని శ్రేయస్ చెప్పాడు. ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున శ్రేయస్ కెప్టెన్, బ్యాట్స్మన్గా రాణించిన విషయం తెలిసిందే. తన అద్భుత సారథ్యంతో ఢిల్లీని ఫైనల్స్ చేర్చాడు.
ISL 2020-21: ముంబై సిటీ vs ఎస్సీ ఈస్ట్ బెంగాల్.. తుది జట్లు ఇవే!!