మయాంక్ హాఫ్ సెంచరీ
సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించడంతో... తొలి మూడు ఇన్నింగ్స్ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన మూడో భారత ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు ఈ జాబితాలో సునీల్ గావస్కర్, పృథ్వీషాలు ఉండగా, ఇప్పుడు వారి సరసన మయాంక్ నిలిచాడు.
|
ఎనిమిదో భారత ఓపెనర్గా
మరొవైపు ఆస్ట్రేలియాలో కనీసం రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఎనిమిదో భారత ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ అరుదైన గుర్తింపుని సాధించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగగా ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాలు క్రీజులోకి వచ్చారు. కేఎల్ రాహుల్(9) పరుగుల వద్ద హాజల్వుడ్ బౌలింగ్లో షాన్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
క్రీజులోకి వచ్చిన పుజారాతో
అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి ఇన్నింగ్స్ను మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ను నడిపించాడు. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత నాథన్ లియాన్ బౌలింగ్లో మయాంక్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ, పుజారాతో కలిసి ఇన్నింగ్స్ను చక్కబెట్టాడు.
|
టెస్టుల్లో పుజారాకు 18వ సెంచరీ
ఈ సిరిస్లో పుజారా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి సాధించాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 18వ సెంచరీ కాగా ఈ సిరిస్లో మూడోది. స్టార్క్ బౌలింగ్లో బంతిని బౌండరీకి పంపడంతో పుజారా 100 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ 76 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది.