31వ అంతర్జాతీయ టీ20 వికెట్ను
ఈ మ్యాచ్లో కుల్దీప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆసీస్తో 3 టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఈ చైనామన్ బౌలర్ 2 వికెట్లు తీశాడు. అరోన్ ఫించ్, క్రిస్ లిన్ వికెట్లను కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా 31వ అంతర్జాతీయ టీ20 వికెట్ను కుల్దీప్ సాధించాడు. ఈ క్రమంలోనే తొలి 15 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో అత్యధిక వికెట్లను సాధించిన ఘనతను కుల్దీప్ సొంతం చేసుకున్నాడు. తద్వారా అజంతా మెండిస్(శ్రీలంక) రికార్డును కుల్దీప్ బ్రేక్ చేశాడు.
సరి కొత్త రికార్డుతో కుల్దీప్ యాదవ్
తొలి 15 టీ20 మ్యాచ్ల్లో మెండిస్ 29 వికెట్లు సాధించగా, దాన్ని తాజాగా కుల్దీప్ అధిగమించాడు. తొలి 15 అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుల్దీప్, మెండిస్లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, చాహల్(27) మూడో స్థానంలో నిలిచాడు.
డక్వర్త్ పద్ధతి ప్రకారం 174 లక్ష్యాన్ని
డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి పరాజయం చెందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు శుభారంభం లభించకపోయినా.. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా మాక్స్వెల్(46), క్రిస్ లిన్(37), మార్కస్ స్టోయినిస్(33) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. మొత్తంగా ఈ మ్యాచ్లో ఆసీస్ 17ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158పరుగులు సాధించింది.
ప్రధాన వికెట్లు కోల్పోవడంతో చేతులెత్తేసింది
మాక్స్వెల్(46), క్రిస్ లిన్(37), మార్కస్ స్టోయినిస్(33) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. చివర్లో వర్షం రావడంతో డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం.. మ్యాచ్ను 17ఓవర్లకు కుదించి భారత్ లక్ష్యాన్ని 174పరుగులుగా సవరించారు. చేధనలో పోరాడిన టీమిండియా ప్రధాన వికెట్లు కోల్పోవడంతో చేతులెత్తేసింది. దీంతో కేవలం 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.