రోహిత్ @ 99:
తొలి టీ20 మ్యాచ్తో టీమిండియా ఓపెనర్/కెప్టెన్ రోహిత్ శర్మ రెండు రెండు రికార్డులు నెలకొల్పాడు. భారత మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, సారథి విరాట్ కోహ్లీ రికార్డులను రోహిత్ బద్దలు కొట్టాడు. తొలి టీ20 ఆడడంతో.. రోహిత్ శర్మ అత్యధిక టీ20లు ఆడిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 98 టీ20లు ఆడిన ధోనీ ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడా రికార్డును రోహిత్ అధిగమించాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20 రోహిత్కు 99వది.
అగ్రస్థానంలో మాలిక్:
అత్యధిక టీ20లు ఆడిన భారత ఆటగాళ్లలో రోహిత్ అగ్రస్థానంలో, ధోనీ ద్వితీయ స్థానంలో ఉండగా.. 78 టీ20లతో సురేశ్ రైనా మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 72 టీ0లు ఆడాడు. అయితే వరల్డ్ అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ (111) ఉండగా.. రెండో స్థానంలో మరో పాకిస్థానీ షాహిద్ ఆఫ్రిది (99) ఉన్నాడు. మూడో, నాలుగో స్థానాల్లో రోహిత్, ధోనీ ఉన్నారు.
టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు:
తొలి టీ20 మ్యాచ్లో రోహిత్ 9 పరుగులు మాత్రమే చేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. రోహిత్ 9 పరుగులు చేయడంతో.. కోహ్లీని అధిగమించి టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానంకు దూసుకొచ్చాడు. 2,452 పరుగులతో రోహిత్ మొదటి స్థానంలో ఉండగా.. 2,450 పరుగులతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 72 మ్యాచుల్లో 2,450 పరుగులు చేస్తే.. రోహిత్ 99 మ్యాచుల్లో 2,452 పరుగులు చేసాడు.
ఓపెనర్గా అరంగేట్రం:
రోహిత్ శర్మ ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్లో టెస్ట్ క్రికెట్లో ఓపెనర్గా అరంగేట్రం చేశాడు. ఆరు ఇన్నింగ్స్లలో 529 పరుగులు చేశాడు. ఆ సిరీస్లో టెస్ట్ క్రికెట్లో రోహిత్ తన తొలి డబుల్ సెంచరీ సాధించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్-10లో నిలిచాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో టాప్-10లో ఉన్న బ్యాట్స్మెన్లలలో తన పేరును కూడా లికించుకున్నాడు.