అజహరుద్దీన్ రికార్డు బద్దలు
ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా రెండు, మూడో టెస్టుల్లో ఫాలోఆన్కు పిలవడంతో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. కోహ్లీ 8 సార్లు ప్రత్యర్థిని ఫాలోఆన్కు ఆహ్వానించగా, అజహరుద్దీన్ తన కెరీర్లో ఏడుసార్లు ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్కు ఆహ్వానించాడు.
ఇది రెండోసారి
మహేంద్ర సింగ్ ధోని ధోని(5), సౌరవ్ గంగూలీ(4) ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక, ఫాలో ఆన్లో విరాట్ కోహ్లీ(ఐదు విజయాలు, రెండు డ్రాలు)గా రికార్డు ఉంది. 1993-94 హోం సిరిస్లో తర్వాత వరుసగా ఓ జట్టుని రెండు సార్లు ఫాలో ఆన్ ఆడించడం ఇది రెండోసారి.
రెండు మ్యాచ్ల్లో
సిరిస్లో శ్రీలంకను టీమిండియా రెండు సార్లు ఫాలో ఆన్ ఆడించింది. మరోవైపు దక్షిణాఫ్రికా ఓ సిరిస్లో రెండు మ్యాచ్ల్లో ఫాలోఆన్ ఆడటం ఇది రెండోసారి. 2001-02లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా దక్షిణాఫ్రికా తొలిసారి ఓ సిరిస్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఫాలోఆన్ ఆడింది.
రెండో స్థానంలో నిలిచిన మ్యాచ్
ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సఫారీలు వరుసగా రెండోసారి ఫాలోఆన్ ఆడుతున్నారు. దీంతో పాటు దక్షిణాఫ్రికాపై తొలి ఇన్నింగ్స్లో భారత్ అత్యధిక పరుగుల ఆధిక్యం సాధించిన జాబితాలో తాజా మ్యాచ్ రెండో స్థానంలో నిలిచింది. రాంచీలో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
ఫాలోఆన్ ఆరంభంలోనే తడబాటు
ఈ వరుసలో 2009-10 సీజన్లో దక్షిణాఫ్రికాతో కోల్కతాలో జరిగిన మ్యాచ్ టాప్లో నిలిచింది. ఆ మ్యాచ్లో భారత్కు 347 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక, ఫాలోఆన్లో సైతం దక్షిణాఫ్రికా ఆరంభంలోనే రెండు వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఓపెనర్ డీకాక్(5)ను ఉమేశ్ యాదవ్ బౌల్డ్ చేయగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హమ్జా(0)ను షమీ బౌల్డ్ చేశాడు.