|
కోహ్లీ డబుల్ సెంచరీ
తాజా డబుల్ సెంచరీతో విరాట్ కోహ్లీ వెస్టిండిస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా దేశాలపై డబుల్ సెంచరీ సాధించినట్లైంది. అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే విరాట్ కోహ్లీ తన తొలి 41వ టెస్టుల్లో డబుల్ సెంచరీని సాధించపోవడం. ఆ తర్వాత 41 టెస్టుల్లో ఏకంగా 7 డబుల్ సెంచరీలు సాధించాడు.
2016 తర్వాత
2016 తర్వాత నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్తో చెలరేగుతున్నాడు. దక్షిణాఫ్రికా డబుల్ సెంచరీ సాధించడంతో టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ రికార్డుని సైతం విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. భారత్ తరుపున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
|
81 టెస్టుల్లోనే 7 డబుల్ సెంచరీలు
విరాట్ కోహ్లీ కేవలం 81 టెస్టుల్లోనే 7 డబుల్ సెంచరీలు సాధించడం విశేషం. వీరేంద్ర సెహ్వాగ్ మొత్తం 104 టెస్టులాడి 6 డబుల్ సెంచరీలు సాధంచగా.... సచిన్ టెండూల్కర్ మొత్తం 200 టెస్టులాడి 6 డబుల్ సెంచరీలు సాధించారు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.
అగ్రస్థానంలో డబుల్ సెంచరీ
డాన్ బ్రాడ్ మన్(12) డబుల్ సెంచరీతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.... కుమార సంగక్కర(11), బ్రియానా లారా(9) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ(7) డబుల్ సెంచరీతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో భారత క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు.
|
బ్రాడ్ మన్ రికార్డు బద్దలు
కోహ్లీకి కంటే ముందు ఈ జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. పూణె టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్ మన్(6996) పరుగుల రికార్డుని కూడా అధిగమించాడు. ఓవర్నైట్ స్కోర్ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.
|
నాలుగో వికెట్కు 178 పరుగుల భాగస్వామ్యం
కోహ్లీ, రహానే(59)తో కలిసి నాలుగో వికెట్కు 178 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలో రహానే హాఫ్ సెంచరీ తర్వాత మహారాజ్ బౌలింగ్లో వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం 149 ఓవర్లకు గాను టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 530 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(216), జడేజా(58) పరుగులతో ఉన్నారు.