హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు 2019 సంవత్సరం ఓ వరం అనే చెప్పాలి. ఇంగ్లాండ్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఐదు సెంచరీలు తర్వాత టెస్టుల్లో ఓపెనర్గా సెంచరీలు మీద సెంచరీలు బాదాడు. ఈ ఏడాది మొత్తంగా మూడు ఫార్మాట్లలో రెండు వేలకు పైగా పరుగులు చేశాడు.
ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ(2296) అగ్రస్థానంలో ఉండగా... ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ 2113 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ యావరేజి 50కి పైగా ఉండటం విశేషం. టీ20ల్లో మాత్రం రోహిత్ రికార్డు ఏమంత మెరుగ్గా లేదు.
183 ఆటోగ్రాఫ్లే 'ధోనీ' వీరాభిమాని లక్ష్యం.. ఇప్పటికి ఎన్ని తీసుకున్నాడో తెలుసా?
ఈ ఏడాది ఇప్పటివరకు 13 టీ20లు ఆడిన రోహిత్ శర్మ 325 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి 25. గత ఆరేళ్లలో రోహిత్ శర్మ ఇంత తక్కువ యావరేజిని కలిగి ఉండటం ఇదే మొదటిసారి. ఈ 13 మ్యాచ్ల్లో రోహిత్ శర్మ కేవలం మూడు మ్యాచ్ల్లోనే 50కిపైగా పరుగులు సాధించాడు. అలాగే, 6 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుతో ఔటయ్యాడు.