పెర్త్: మహిళల టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా ఆడిన తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టింది. ఆదివారం గ్రూప్ 'బి'లో భాగంగా జరిగిన మ్యాచ్లో సఫారీ జట్టు ఇంగ్లండ్కు షాకిచ్చింది. ఉత్కంఠ రేపిన ఈ పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్పై గెలుపొందింది. తొలిసారి ఇంగ్లండ్ లాంటి మేటి జట్టుపై గెలుపొంది చరిత్రకెక్కారు సఫారీ మహిళలు. టీ20 ప్రపంచకప్లో తొలిసారి ఇంగ్లండ్పై సఫారీలు విజయం సాధించారు. సఫారీ స్టార్ బ్యాట్స్వుమన్ ఇక డు ప్రీజ్100వ టీ20 మ్యాచ్ ఆడింది.
ఆ ప్రణాళికతోనే కోహ్లీని పెవిలియన్కు చేర్చాం: బౌల్ట్
మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. సీవర్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించింది. ఓపెనర్ జోన్స్ (20 బంతుల్లో 23; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. విల్సన్ (14) పర్లేదనిపించారు. సఫారీ బౌలర్లు అయబొంగ (3/25), వాన్ నికెర్క్ (2/20), మరిజనె (2/19) వికెట్లు పడగొట్టారు.
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి విజయాన్ని అందకుంది. ఓపెనర్, కెప్టెన్ వాన్ నికెర్క్ (51 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్లు), మరిజనె (33 బంతుల్లో 38; 6 ఫోర్లు) రాణించారు. ఇంగ్లిష్ బౌలర్ ఎకిల్స్టోన్ 2 వికెట్లు తీసింది. చివరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన దశలో.. తొలి రెండు బంతులకు 2 రన్సే రావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. కానీ డు ప్రీజ్ (18 నాటౌట్) ఒత్తిడిని అధిగమించి 3, 4 బంతులను సిక్స్, ఫోర్ బాది దక్షిణాఫ్రికాకు అద్భుత విజయాన్ని అందించింది.
టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు మరో మ్యాచ్కు సిద్ధమైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. నేడు వాకా మైదానంలో బంగ్లాదేశ్తో తలపడనుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్ ఈ మ్యాచ్లో గెలిస్తే నాకౌట్ దశకు దగ్గరైనట్టే. సోమవారం జరిగే మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా-శ్రీలంక తగ్గాలపడనున్నాయి. రెండు జట్లు ఆడిన తొలి మ్యాచ్లలో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది.