అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ
అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బోర్డుకు కోత పెట్టిన ఆదాయం విషయంలో ఐసీసీతో తాడో పేడో తేల్చుకునేందుకు గంగూలీ సిద్ధమయ్యాడు. సుమారు రూ.165 కోట్ల వరకు కోత పెట్టిన ఐసీసీపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాడు.
టీ20 వరల్డ్కప్ 2016 సందర్భంగా
భారత్ ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్కప్ 2016 సందర్భంగా ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు ఇప్పిస్తామన్న హామీని బీసీసీఐ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో బోర్డుకు రావాల్సిన 23 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.165 కోట్లు) ఆదాయాన్ని కోత విధించింది. ఈ విషయం తమ పరిధిలోది కాదని ఐసీసీతో బోర్డు వాదిస్తూనే ఉంది.
ఐసీసీపై న్యాయపోరాటం
అయినా సరే ఐసీసీ మెత్తబడలేదు. దీంతో ఐసీసీతో అమీతుమీ తేల్చుకోవాలని సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఐసీసీపై న్యాయపోరాటం చేసేందుకు దుబాయ్కి చెందిన హెర్బర్ట్ స్మిత్ ఫ్రీహిల్స్ సంస్థను బీసీసీఐ నియమించుకుంది.