రోహిత్, బుమ్రాలకు చోటు:
ప్రపంచకప్ జట్టులో టీమిండియా నుంచి ఓపెనర్ 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రమే చోటు దక్కింది. అర్ధ శతకాలు బాదిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు. వరుస అర్ధ శతకాలు బాదిన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ చోటు దక్కించుకున్నాడు. మరో ఓపెనర్గా ఇంగ్లాండ్ ఆటగాడు జేసన్ రాయ్ ఎంపికయ్యాడు. ప్రపంచకప్లో అత్యధిక వికెట్ల వీరుడు మిచెల్ స్టార్క్, సంచల బౌలర్ జోఫ్రా ఆర్చర్ ప్రధాన బౌలర్లుగా ఎంపికయ్యారు.
పరుగుల వీరులకు మొండిచేయి:
నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లు జట్టులో ఉండడం విశేషం. భారత్, ఆసీస్ నుండి ఇద్దరు, ఇద్దరు ఉన్నారు. ప్రపంచకప్లో పరుగుల వీరులు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, బెయిరిస్టో, బాబర్ ఆజామ్ లాంటి వారు చోటు దక్కించుకోలేకపోయారు. ఇక 20 వికెట్లు తీసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా జట్టులోకి ఎంపిక కాలేదు.
ఐసీసీ ప్రపంచకప్ జట్టు:
జేసన్ రాయ్ (ఇంగ్లాండ్), రోహిత్ శర్మ (భారత్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జో రూట్ (ఇంగ్లాండ్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), అలెక్స్ కేరీ (ఆస్ట్రేలియా), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్), లుకీ ఫెర్గుసన్ (న్యూజిలాండ్), జస్ప్రిత్ బుమ్రా (భారత్), ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్).