తక్కువ అంచనవేయలేం:
తాజాగా జాసన్ బెహ్రాన్డార్ఫ్ మాట్లాడుతూ... 'రెండు వరుస పరాజయాలు చవిచూసినంత మాత్రాన టైటిల్ రేసు నుంచి ఇంగ్లండ్ తప్పుకోలేదు. ఓటములు చెందినంత మాత్రాన ఇంగ్లండ్ను తక్కువ అంచనవేయలేం. వరుస విజయాలతో ఆసీస్ టైటిల్ వేటలో ముందంజలో ఉంది. ప్రపంచకప్లో ఆసీస్తో పాటు ఇప్పటికీ ఇంగ్లండ్ కూడా ఫేవరేట్ జట్టే' అని బెహ్రాన్డార్ఫ్ అభిప్రాయపడ్డాడు.
అవకాశం ఎప్పుడైనా రావచ్చు:
'తొలిసారి ఐదు వికెట్లు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. అందులోనూ ప్రపంచకప్లో ఈ ఘనత అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రపంచకప్ అరంగేట్రపు మ్యాచ్లో శ్రీలంకపై అంతగా రాణించకపోవడంతో నన్ను పక్కకు పెట్టారు. అయితే ఈ సమయంలో కృంగిపోకుండా జట్టులోకి ఎలా తిరిగి రావాలిన ఆలోచించాను. దేశం తరుపున ఆడే అవకాశం ఎప్పుడైనా రావచ్చు, సిద్దంగా ఉండాలని అనుకున్నా. అవకాశం వచ్చింది. నిరూపించుకున్నా' అని బెహ్రాన్డార్ఫ్ తెలిపారు.
రెండూ గెలవాలి:
టోర్నీ ఆరంభంలో ఇంగ్లండ్ సునాయాసంగా సెమీస్ బెర్త్ దక్కించుకుంటుందని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాజా ఓటమితో ఏడు మ్యాచ్లాడి కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించిన ఇంగ్లండ్.. ఇకపై ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి తీరాలి. అయితే ఇంగ్లండ్ తమ ఆఖరి రెండు మ్యాచ్లనూ బలమైన భారత్, న్యూజిలాండ్లతో ఆడాల్సి ఉంది. రెండింటిలో ఒక్కటి ఓడినా సెమీస్ బెర్త్ దక్కే అవకాశాలు తగ్గుతాయి. ఇదే జరిగితే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.