వన్డే సిరీస్ను 3-0తో గెలిచాం
"న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను 3-0తో గెలిచాం కాబట్టి సంతోషంగా బ్రేక్ తీసుకుంటా. విరామ సమయాన్ని బాగా గడుపుతాను. ఎవరో ఒకరు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. మనం ఉన్నా లేకున్నా ఆట కొనసాగుతుంది. ప్రస్తుతానికి జట్టు కూర్పు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని కోహ్లీ వెల్లడించాడు.
నాలుగో నంబర్లో
"నాలుగో నంబర్లో బలమైన బ్యాట్స్మన్ ఉండాలని భావించాం. ఆ స్థానంలో రాయుడు ఆడుతున్న తీరు అద్భుతం. దినేశ్ కార్తీక్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఏ క్షణమైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉంటాడు. మిడిలార్డర్లో ధోనీ బంతిని బాగా బాదుతున్నాడు. ఈ మూడు మ్యాచ్లను బట్టి చూస్తే ఇక బ్యాటింగ్ బాధలు తీరినట్లే" అని కోహ్లీ వెల్లడించాడు.
పాండ్యా రాకతో జట్టులో సమతుల్యం
"పాండ్యా రాకతో జట్టులో సమతుల్యం వచ్చింది. అతను తల దించుకునే ఉన్నాడు. కానీ, జట్టుకు ఏం అవసరమో అది చేసి చూపించాడు. ఈ రోజు బాధ్యతగా అతను ఆడిన తీరు అమోఘం. శుభ్మాన్, విజయ శంకర్ వంటి యువ ప్రతిభావంతులు జట్టుతో చేరడం చాలా ఆనందాన్నిస్తున్నది. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ల సేవలను మరింతగా వినియోగించుకోవాలి" అని కోహ్లీ అన్నాడు.
కోహ్లీ స్థానంలో కెప్టెన్గా రోహిత్ శర్మ
సెలెక్టర్లు విశ్రాంతి కల్పించడంతో చివరి రెండు వన్డేలతో పాటు మూడు టీ20ల సిరిస్కు కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. కాగా, కోహ్లీ స్థానంలో భారత జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు.