వేర్వేరు తరాల ఆటగాళ్లని పోల్చి చూడలేం
‘వాళ్లిద్దరినీ పోల్చి చూడాలని నేను అస్సలు అనుకోను. సచిన్ గొప్ప బ్యాట్స్మన్. అతని పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. విరాట్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇది అతనికి గొప్ప విజయం. కానీ విరాట్కు సచిన్ ఆరాధ్యుడు. ఇద్దరు వేర్వేరు తరాల ఆటగాళ్లు. వారిద్దరినీ పోల్చి చూడలేం' అని రాజ్కుమార్ వెల్లడించారు.
ధావన్, రోహిత్ కచ్చితంగా చెలరేగి
‘టీ20 ఫార్మాట్ వాళ్లకు(వెస్టిండీస్) బాగా సరిపోతుంది. ఈ ఫార్మాట్లో వాళ్లు చాలా ప్రమాదకరం. ఇటీవల జరిగిన వన్డే సిరీస్ తొలి మూడు మ్యాచుల్లో వాళ్లు ఎలా ఆడారో చూశాం. ఇప్పుడు అండ్రీ రసెల్, కార్లోస్ బ్రాత్వైట్, కీరన్ పొలార్డ్ జట్టులోకి వచ్చారు. ఈ ఆటగాళ్లు వాళ్లదైన రోజున చేతుల్లో మ్యాచ్ను లాగేసుకుంటారు. మిడిలార్డర్ బలహీనంగా ఉంది కాబట్టి శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కచ్చితంగా చెలరేగి ఆడాలి' అని రాజ్కుమార్ తెలిపారు.
టీ20 సిరీస్కు ఎంపికైన కృనాల్ను పొగడ్తలతో
వెస్టిండీస్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మలపై పెద్ద బాధ్యతే ఉందని రాజ్కుమార్ అభిప్రాయపడ్డారు. టీ20 సిరీస్కు ఎంపికై షాబాజ్ నదీమ్, కృనాల్ పాండ్యను రాజ్ కుమార్ పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే, రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ ఆట ఎలా ఉండబోతోందో కూడా రాజ్ కుమార్ వెల్లడించారు.
విరాట్ దూకుడుగా ఆడగలడు
‘ఆస్ట్రేలియా గడ్డపై అగ్రెసివ్ క్రికెట్ ఆడాలి. అక్కడ వికెట్పై బంతి ఏ విధంగా వస్తుందో అంచనా వేయాలి. విరాట్ అక్కడ దూకుడుగా ఆడగలడు. అక్కడ వికెట్పై బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ అది అతనికి అడ్డంకి కానేకాదు' అని తన శిష్యుడిపై రాజ్ కుమార్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.