51 బంతుల్లో సెంచరీ సాధించిన హర్మన్ప్రీత్
ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ మొత్తం 51 బంతుల్లో సెంచరీ సాధించింది. ఆ తర్వాత టోర్నీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాక్తో జరిగిన రెండో మ్యాచ్లో ఓపెనర్ మిథాలీరాజ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురింపించేలా చేసింది.
రు జట్లు జాతీయ గీతం పాడడానికి
సాధారణంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లకు సంబంధించిన జాతీయ గీతాలను ఆలపించడం ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తోంది. ఇరు జట్లు జాతీయ గీతం పాడడానికి మైదానంలో నిల్చున్న సమయంలో ఎప్పటిలానే ఒక్కోక్కరి ముందు ఒక్కో చిన్నారి నిల్చున్నారు. చిన్నారులందరూ టీ20 వరల్డ్కప్ మస్కట్ ఉన్న టీషర్టులు ధరించి క్రికెటర్ల ముందు నిల్చున్నారు.
జాతీయగీతం అయిపోయేంత వరకు చిన్నారిని చేతితోనే
భారత జాతీయ గీతం ప్రారంభమయ్యే సమయంలో తన ముందు నిల్చున్న చిన్నారి అనారోగ్యానికి గురవడాన్ని హర్మన్ప్రీత్ కౌర్ గమనించింది. జాతీయగీతం అయిపోయేంత వరకు సదరు చిన్నారిని చేతితో పట్టుకుంది. జాతీయ గీతాలాపన పూర్తయిన వెంటనే చేతులతో చిన్నారిని ఎత్తుకుని వెంటనే పెవిలియన్వైపు తీసుకెళ్లింది.
— Mushfiqur Fan (@NaaginDance) November 11, 2018 |
హర్మన్ప్రీత్ సమయస్పూర్తికి నెటిజన్లు ప్రశంసల వర్షం
ఓ వైపు జాతీయ గీతాన్ని ఆలకిస్తూనే, మరోవైపు చిన్నారిని కిందపడకుండా హర్మన్ప్రీత్ చక్కటి సమయస్పూర్తితో వ్యవహరించంటూ ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.