హైదరాబాద్: ఫిబ్రవరి 24... అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో మరపురాని రోజు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ రికార్డు ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చివేసింది. భారత అభిమానులు క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ ఈ రికార్డుని నమోదు చేశాడు.
ఆ రికార్డు ఏంటంటే వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ. 2010 ఫిబ్రవరి 24న ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్మన్గా చరిత్ర సృష్టించాడు. అప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఈ ఘనత సాధించి క్రికెట్లో ప్రపంచ రికార్డుని తన పేరిట లిఖించాడు.
ఈ మ్యాచ్లో 147 బంతులను ఎదుర్కొన్న సచిన్ 25 ఫోర్లు, 3 సిక్స్ర్ల సాయంతో 200 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో భారత్ వన్డేల్లో రెండో అత్యధిక స్కోర్ 401 పరుగులు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ 153 పరుగుల తేడాతో పర్యాటక దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.
తొలి సెంచరీని 90 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన సచిన్... అనంతరం బ్యాటింగ్లో వేగం పెంచి కేవలం 57 బంతుల్లోనే మరో వంద పరుగులు బాదాడు. ఇందులో 25 ఫోర్ల ద్వారానే 100 పరుగులు రాబట్టడం విశేషం. ఆ తర్వాత ఏడాది టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ (219) పరుగులతో డబుల్ సాధించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాతి రోజుల్లో టీమిండియా మరో ఓపెనర్ రోహిత్ శర్మ వన్డేల్లో ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. సచిన్ డబుల్ సెంచరీకి 8 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ట్విట్టర్లో #OnThisDay పేరిట ఈ రికార్డుని బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.
#ThisDay in 2010 the great @sachin_rt became the first batsman to score a double ton in ODI cricket.
— BCCI (@BCCI) February 24, 2018
He faced 147 balls and scored the first double century with 25 fours and 3 sixes against South Africa at Gwalior #Legend. pic.twitter.com/cwb0TRA9TT
#OnThisDay in 2010 Sachin Tendulkar Made 200* in Gwalior ODI Vs #SouthAfrica. It took 39Yrs, 2962 ODIs & 1052 100s for it to come.
— CrickeTendulkar 🇮🇳 (@CrickeTendulkar) February 24, 2018
37yr old @sachin_rt proved Nothing is Impossible. The myth of 200 finally broken by #SachinTendulkar. Best ODI Double Hundred #MaidenODIDoubleCentury pic.twitter.com/Ac7OqpEZwc
గేల్ డబుల్ సైతం ఇదే రోజు డబుల్ సెంచరీ:
కాగా, వెస్డిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్గేల్ సైతం డబుల్ సెంచరీ ఇదే రోజు నమోదు చేయడం విశేషం. 2015 ఫిబ్రవరి 24న జింబాబ్వేతో కాన్బెర్రా వేదికగా జరిగిన మ్యాచ్లో గేల్ 10 ఫోర్లు, 16 సిక్స్ల సాయంతో 215 పరుగుల చేసి ఔటయ్యాడు.
Exactly five years after @sachin_rt made the first double century in men's ODIs, @henrygayle joined the 200 club with 215 against Zimbabwe at the @cricketworldcup, #OnThisDay in 2015! 🔥 pic.twitter.com/JOHUE2qDBt
— ICC (@ICC) February 24, 2018