ఆ అధికారి వ్యాఖ్యలు బాధాకరం:
ఐపీఎల్ వాయిదా పడిన సందర్భంగా ఓ ఉన్నతాధికారి దేశవాళీ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ప్రస్తావన తెచ్చారు. ఐపీఎల్ను తక్కువ నాణ్యత కలిగిన టోర్నీగా ప్రదర్శించలేమన్నారు. దీనిపై గవాస్కర్ స్పందించారు. 'ఐపీఎల్ను తక్కువ నాణ్యత కలిగిన టోర్నీగా ప్రదర్శించలేమని చెబుతూ, మరో ముస్తాక్ అలీ టోర్నీ అవసరం లేదన్న ఆ అధికారి వ్యాఖ్యలు బాధాకరం. ఎందుకంటే.. వారు ఓ దిగ్గజాన్ని అవమానపరిచారు. ఆ తర్వాత దాన్ని పేలవ టోర్నీగా పేర్కొన్నారు. మరి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీని ఎందుకు నిర్వహిస్తున్నారు' అని ప్రశ్నించారు.
గ్రేట్ మ్యాన్ను అగౌరవపరిచారు:
'ముస్తాక్ అలీ టోర్నీ పేరు చెప్పి ఓ గ్రేట్ మ్యాన్ను అగౌరవపరిచారు. ఆ తర్వాత పేలవమైన టోర్నమెంట్ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ టోర్నీ ఎందుకు పేలవంగా మారింది. ఆ టోర్నీలో అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండరు అనే విషయం తెలుసు కదా. అది దేశవాళీ టోర్నీ. అంతర్జాతీయి స్థాయిలో ఆడే భారత ఆటగాళ్లు లేకపోవడం వల్లే అది పేలవంగా మారింది. బీసీసీఐ బిజీ షెడ్యూల్ కారణంగా ముస్తాక్ అలీ టోర్నీకి ఆదరణ తగ్గింది. దీనిపై బీసీసీఐ దృష్టి సారించాలి. ఆ టోర్నీని మెరుగుపరిచే అంశంపై ఫోకస్ చేయాలి' అని గావస్కర్ సూచించారు. .
ఇప్పుడు చాలా కష్టం:
సునీల్ గవాస్కర్ తాజాగా వార్తా దినపత్రిక డైనిక్ జాగ్రాన్తో మాట్లాడుతూ... 'వ్యక్తిగతంగా టీ20 ప్రపంచకప్ జట్టులో ఎంఎస్ ధోనీ ఉండాలని కోరుకుంటున్నా. కానీ అదే జరిగే అవకాశం లేదు. జట్టులోకి ధోనీ ఎంపిక ఇప్పుడు చాలా కష్టంగా మారింది. ఇప్పటికే ధోనీని పక్కనపెట్టి టీమిండియా చాలా ముందుకు వెళ్లిపోయింది. ఇక ధోనీ తన వీడ్కోలుని ఘనంగా ఆశించకపోవచ్చు. ఎలాంటి హడావుడి లేకుండా క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది' అని గవాస్కర్ అన్నారు.