
దెబ్బ తీసిన అశ్విన్..
అంతకు ముందు 157 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ పంజాబ్ కేఎల్ రాహుల్ సూపర్ బ్యాటింగ్తో ధాటిగానే ప్రారంభించింది. 2 ఫోర్లు, 1 సిక్స్తో క్రీజులో కుదురుకున్న రాహుల్ను మోహిత్ శర్మ అద్భుత ఇన్స్వింగర్తో క్లీన్ బౌల్డ్ చేసి ఢిల్లీకి శుభారంభాన్నిచ్చాడు. ఆ మరుసటి ఓవర్ వేసిన రవిచంద్రన్ అశ్విన్.. కరన్ నాయర్(1), నికోలస్ పూరన్(0)ను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. కరన్ క్యాచ్ ఔట్ కాగా పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక అశ్విన్ స్పిన్కు పూరన్ బిత్తరపోయాడు. అయితే ఈ ఓవర్ చివరి బంతికి తీవ్రంగా గాయపడ్డ అశ్విన్ మైదానాన్ని వీడాడు.

5 పరుగులు..4 వికెట్లు..
ఆ వెంటనే ఎన్నో అంచనాలు పెట్టుకున్న విధ్వంసకర వీరుడు గ్లేన్ మ్యాక్స్వెల్(1) కూడా నిరాశపరిచాడు. రబడా బౌలింగ్లో అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 5 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్(12)తో మయాంక్ అగర్వాల్ నిదానంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన సర్ఫరాజ్ లాంగాన్లో పృథ్వీషాకు చిక్కి భారంగా పెవిలియన్ చేరాడు.

మయాంక్ ఒంటరి పోరాటం..
ఇక ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు మయాంక్ అగర్వాల్ ఒంటరి పోరాటం చేశాడు. స్టోయినిస్ బౌలింగ్లో మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన మయాంక్... నోర్జ్ బౌలింగ్లో మరో రెండు బౌండరీలు తరలించి బ్యాటింగ్ వేగం పెంచాడు. ఈ క్రమంలోనే 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన మయాంక్ జట్టును విజయం దిశగా నడిపించాడు.

స్టోయినిస్ సూపర్ బౌలింగ్..
ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు కావాల్సి ఉండగా స్టోయినిస్ వేసిన తొలి బంతిని సిక్స్ కొట్టిన మయాంక్.. అనంతరం డబుల్ తీసి మరుసటి బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే ఈ పరిస్థితుల్లో పంజాబ్ విజయం ఖాయమనిపించింది. కానీ నాలుగో బంతిని డాట్ చేసిన మయాంక్.. ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. ఇక ఆఖరి బంతికి జోర్డాన్ ఔటవ్వడంతో మ్యాచ్ టై అయింది. అనూహ్య మలుపులు తిరిగిన ఈ మ్యాచ్ అభిమానులను ఊపిరి పీల్చుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేేసింది. అసలు సిసలు మజాను అందించింది.


Click it and Unblock the Notifications
