టాస్ ఓడి తొలుత బ్యాటింగ్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్రైజర్స్కు ఓపెనర్లు శుబారంభాన్ని అందించారు. తొలుత నెమ్మదిగా ఆడిన వార్నర్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రస్సెల్ బౌలింగ్లో వార్నర్(85) ఔటయ్యాడు.
ఐపీఎల్లో 40వ హాఫ్ సెంచరీ
ఏడాది తర్వాత ఐపీఎల్లోకి పునరాగమనం చేసిన వార్నర్ తొలి వికెట్కి జానీ బెయిర్స్టో (39: 35 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ (40 నాటౌట్: 24 బంతుల్లో 2 పోర్లు, 2 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
భువనేశ్వర్కు పగ్గాలు
మరోవైపు సన్రైజర్స్ హిట్టర్ యూసఫ్ పఠాన్ (1: 4 బంతుల్లో) నిరాశపరచగా.. మనీశ్ పాండే (8 నాటౌట్) చివర్లో ఫరవాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్తో ఇటీవల టెస్టు మ్యాచ్లో గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడి స్థానంలో భువనేశ్వర్కు పగ్గాలు అప్పజెప్పారు.