సరైన ప్లేయర్లతో బరిలోకి దిగాలి
రాబోయే టి20 ప్రపంచకప్కు తుది జట్టు ఎంపికలో ఆజామ్కు పెద్దపాత్ర ఉందని.. అతను సరైన ప్లేయర్ల కూర్పుతో బరిలోకి దిగాల్సిన అవసరం ఉందని కనేరియా చెప్పాడు. 'బాబర్ నిస్సందేహంగా గొప్ప ప్లేయరే. కాకపోతే అతను జట్టు ఎంపిక విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదనిపిస్తుంది. అతను సరైన తుది జట్టుకు మద్దతు ఇస్తున్నట్లు నేను భావించడం లేదు' అని కనేరియా తెలిపాడు. ఆసియా కప్లో ఓపెనర్గా బరిలోకి దిగిన ఆజామ్ పేలవ ప్రదర్శన వల్ల అతని పట్ల విమర్శలు తీవ్రమయ్యాయి. అతను 107.93 స్ట్రైక్ రేట్తో 6మ్యాచ్ల్లో కేవలం 68పరుగులు మాత్రమే చేయడం ఆందోళన రేకెత్తించింది.
ఆందోళనకరంగా వారిద్దరి స్టైక్రేట్లు
'జట్టులో ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్ల స్ట్రైక్రేట్ తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. వారు పవర్ ప్లేలో ఫీల్డ్ పరిమితులను ప్రారంభంలో ఉపయోగించుకోలేకపోతున్నారు. తర్వాత బ్యాటింగ్కు దిగే బ్యాటర్లకు సరైన స్టాండ్ ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారు.' అని కనేరియా చెప్పాడు. ఆజామ్ బ్యాటింగ్ ఆర్డర్లో ఓపెనర్గా కాకుండా డౌన్ ఆర్డర్లోకి వెళితే బాగుంటుందని, పాకిస్థాన్ జట్టు తరఫున మరొకరు ఇన్నింగ్స్ తెరిచేలా ప్లాన్స్ వేయాలని కనేరియా పిలుపునిచ్చారు.
ఓపెనర్గా బాబర్తో కాకపోతే..
'అతను ఓపెనర్గా స్కోర్ చేయలేకపోతే.. అతని స్థానంలో మరొక ఆటగాడిని ఆడిస్తే బాగుంటుందని అతను అర్థం చేసుకోవాలి. అతను తనను తాను నం.3స్థానానికి పరిమితం చేసుకోగలడు. ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లో ఇలాంటి ప్రయోగం చేయొచ్చు. ' అని కనేరియా తెలిపారు. టీ20 ప్రపంచకప్కు వెళ్లే క్రమంలో పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఏడు టీ20ల్లో తలపడనున్నాయి. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 20న ఈ సిరీస్ ప్రారంభం కానుంది.