హైదరాబాద్: ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో మంగళవారం తెల్లవారుజూమున జరిగిన ఉగ్ర దాడిపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు ఖండించారు. ట్విట్టర్ వేదికగా పలువురు క్రికెటర్లు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమెరికా పాప్స్టార్ అరియానా గ్రాండే కన్సర్ట్ జరుగుతున్న వేదికకు అతి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో ఇప్పటివరకు 22 మంది మృతిచెందగా 59 మంది వరకు గాయపడ్డారు. భారీ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలతో ఓ వ్యక్తి సంగీత కచేరి వెలుపల ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు లండన్ పోలీసులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తి మృతదేహాన్ని ఘటనాస్థలంలో పోలీసులు గుర్తించారు.

అరియానా కన్సర్ట్ను వీక్షించేందుకు ఇరవై వేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. వీరిలో చాలా మంది 6 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నవారే. అయితే బాంబు వేదిక వెలుపల పేలడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే తీవ్రంగా ఖండించారు.
ఈ ఉగ్రఘటనపై క్రికెటర్ల స్పందన ఇలా: