ధోనీ కోసం..ఇష్టమైన వీటిని కాసేపు పక్కన:
భారీకాయంతో ఉన్నా.. ధోనీ తరహా హెలికాప్టర్ సిక్సర్లు కొడుతూ షెహజాద్ వెలుగులోకి వచ్చాడు. ‘జీవితంలో రెండింటిని అస్సలు విస్మరించలేను. మొదటిది నిద్ర, రెండోది భోజనం. కానీ.. మహేంద్రసింగ్ ధోనీ కోసం ఓ సారి నాకు ఇష్టమైన వీటిని కాసేపు పక్కన పెట్టాల్సి వచ్చింది. భారత జట్టు వెస్టిండీస్లో మ్యాచ్ ఆడుతోంది. అది ఫైనల్.. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 15 పరుగులు అవసరం అయ్యాయి. ధోనీ క్రీజులో ఉన్నాడు.'
అప్పుడు రంజాన్ ఉపవాస దీక్షలో :
'అప్పటి వరకు ఎప్పుడైనా కాసేపు నిద్ర మేలుకోవాల్సి వస్తే.. నీళ్లు తాగేవాడ్ని. కానీ, ఆ సమయంలో రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నాను. ఇఫ్తార్కి మరో 3 - 4 నిమిషాల సమయమే ఉంది.. నా ముందే భోజనం కూడా సిద్ధంగా ఉంది. ఆ క్షణంలో భారత్ జట్టు గెలవాలని కోరుకున్నా.. ధోనీ రెండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ని ముగించేశాడు. ఆ రోజు ఆనందానికి భోజనంతో పాటు నిద్ర కూడా ఆలస్యమైంది' అని మొహమ్మద్ షెహజాద్ వెల్లడించాడు.
ధోనీ.. 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో.. :
2013లో వెస్టిండీస్ వేదికగా భారత్, శ్రీలంక, వెస్టిండీస్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరిగింది. ఫైనల్లో భారత్తో తలపడిన శ్రీలంక 48.5 ఓవర్లలో 201 పరుగులకి ఆలౌటవగా.. ధోనీ నాటౌట్గా నిలిచి 52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో.. (45) పరుగులు చేసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 49.4 ఓవర్లలో 203/9తో భారత్ గెలుపొందింది.
ఎరంగ బౌలింగ్లో వరుసగా 6, 4, 6 :
ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 15 పరుగులు అవసరమవగా.. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉండటంతో మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. కానీ.. భువనేశ్వర్ని నాన్స్ట్రైక్ ఎండ్లోనే ఉంచిన ధోనీ.. చివరి ఓవర్ వేసిన ఎరంగ బౌలింగ్లో వరుసగా 6, 4, 6 బాది జట్టుని గెలిపించాడు.