|
వుమెన్స్ టీం చెత్త బ్యాటింగ్
ఇకపోతే భారత వుమెన్స్ జట్టు ఫైనల్లో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి రావడం పట్ల మాజీ భారత మెన్స్ టీం కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తీవ్ర కామెంట్లు చేశాడు. జట్టు ప్రదర్శనను నిందించాడు. 'ఇండియా వుమెన్స్ టీం చెత్త బ్యాటింగ్. ఇంగితజ్ఞానం లేకుండా ఆడారు. గెలుపొందిన గేమ్ను కంచెంలో తీసుకెళ్లి ప్రత్యర్థికి అప్పగించారు' అని ట్వీట్ చేశాడు. ఇక వుమెన్స్ టీం ప్రదర్శనను అతను తీవ్రంగా విమర్శించడం పట్ల నెటిజన్ల నుంచి ప్రతివిమర్శలతో ట్వీట్లు పోటెత్తాయి. సపోర్ట్ చేయడం చేతకాదు కాని విమర్శించడం మాత్రం వచ్చు అంటూ చాలా మంది నెటిజన్లు నెట్టింట ట్వీట్లతో అజారుద్దీన్పై విరుచుకుపడుతున్నారు.
|
ఓసారి చూసుకుని కామెంట్ చేయాలి
కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా జట్టు పోరాటానికి అభిమానులు మద్దతు తెలిపారు. భారత జట్టునుద్దేశించి కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేసినందుకు అజారుద్దీన్ను నిందిస్తూ ట్వీట్లు చేశారు. ఇక అజారుద్దీన్ ట్వీట్ వైరల్ అయ్యింది. అతను ఆడే రోజుల్లో ఆస్ట్రేలియన్ టీంకు వ్యతిరేకంగా అతను సాధించిన విజయాలేంటో ఓసారి చూసుకుని కామెంట్ చేయాల్సిందంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. మరో నెటిజన్ 90లలో అజారుద్దీన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న టైంలో టీమిండియ పేలవ ప్రదర్శనను ఎత్తి చూపాడు.
|
కనీసం మంచి భాషను ప్రయోగించాల్సింది
ప్రతిష్టాత్మకమైన కామన్ వెల్త్ ఈవెంట్లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నందుకు వుమెన్స్ జట్టును అభినందించాల్సింది పోయి ఈ నిందలేంటీ బాసు.. కనీసం మంచి భాషను అయినా ప్రయోగించాల్సిందంటూ ఓ నెటిజన్ అజార్కు హితవు పలికాడు. మహిళల జట్టు పట్ల గౌరవంగా వ్యవహరించాలని, బాగా ఆడినప్పుడు ఒక్కసారి కూడా మెచ్చుకోని వ్యక్తికి ఇప్పుడు మాత్రం విమర్శించే హక్కు కూడా లేదంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇకపోతే గత ఆరేళ్లలో భారత మహిళల జట్టు మూడు పెద్ద ఈవెంట్లలో ఫైనల్స్లోకి ప్రవేశించి రన్నరప్గా నిలిచింది. చివర్లో ఒత్తిడిని ఎదుర్కోలేక విఫలమవుతుంది. ఏదేమైనా బీసీసీఐ వుమెన్స్ టీం తమకున్న తక్కువ వనరుల్లోనే ఎంతో మెరుగ్గా ఆడిందనేది జగమెరిగిన సత్యం.