జట్టు ఎంపిక విషయం పట్ల గంగూలీ
టెస్టు సిరీస్లో భాగంగా ఆడిన చివరి మ్యాచ్లో రాహుల్తో కలిసి సెంచరీల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 464 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు రాహుల్తో కలిసి తీవ్రంగా శ్రమించాడు. అలాంటిది 50 ఓవర్ల ఫార్మాట్లో ఆడలేడా అని గంగూలీ ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుత జట్టు ఎంపిక విషయం పట్ల గంగూలీ ఓ నిర్దారణకు వచ్చాడు.
వచ్చే ఏడాదైనా అంతర్జాతీయ స్థాయిలో
అదేంటంటే ఇంగ్లాండ్ చివరి టెస్టు ముగియక ముందే ఆసియా కప్లో ఆడాల్సిన భారత జట్టును ముందుగానే ఎంపిక చేసేసిందని ఖరారైయ్యాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల యువ సంచలనం రిషబ్ పంత్.. వచ్చే ఏడాది అయినా అంతర్జాతీయ స్థాయిలో అవకాశం వస్తే కచ్చితంగా తన ప్రతిభను నిరూపిస్తాడనే నమ్మకాన్ని వ్యక్తపరిచాడు. ఈ సందర్భంగా టీమిండియా ఎంపిక విధానం పట్ల గంగూలీ ఇలా మాట్లాడాడు.
జట్టు ఎంపిక రిషబ్ పంత్ సెంచరీ కొట్టకముందే
'ఆసియా కప్కు టీమిండియా ఎంపికను చూసి ఆశ్చర్యానికి గురైయ్యాను. జట్టు ఎంపిక రిషబ్ పంత్ సెంచరీ కొట్టకముందే సిద్ధమైపోయిందనుకున్నాను. ఓవల్ స్టేడియంలో అతను చేసిన సెంచరీకి తాను వన్డే ఫార్మాట్ లో చక్కటి ప్రదర్శన చేయగలడని భావిస్తున్నాను.'అని ముగించాడు.
ఇంగ్లాండ్ వన్డేలలో రాణించలేకపోయిన ధోనీ
మరో పక్క మహేంద్ర సింగ్ ధోనీ గురించి మాట్లాడుతూ..'ఈ టోర్నమెంట్ ధోనీ కెరీర్లో చాలా ముఖ్యమైన సిరీస్. ఇంగ్లాండ్లో జరిగిన వన్డే మ్యాచ్లలో అంతగా తన సత్తా నిరూపించుకోలేకపోయిన ధోనీ ఈ మ్యాచ్లలో కచ్చితంగా ఆడి తీరాలి. స్కోరు బోర్డును వేగంగా పరుగులెత్తించాలి. అతను వన్డే ఫార్మాట్లో ఆడటం పట్ల ఇప్పటికే పలువురు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేలా అతని ప్రదర్శన ఉండాలి' అని మాజీ కెప్టెన్ తెలిపాడు.