గతేడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్పై సెంచరీ
సాధించిన పాక్ విజయంలో కీలకపాత్ర్ పోషించిన ఫకార్ జమాన్ ఈ మ్యాచ్లో డకౌటయ్యాడు. జింబాబ్వేతో హారారే క్లబ్ స్టేడియంలో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఫకార్ జమాన్ ఈ మ్యాచ్లో తొమ్మిది బంతులను ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఐదో ఓవర్లో ఫుల్ షాట్ను ఆడే క్రమంలో ఫకార్ జమాన్ (0) చాహల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. వన్డేల్లో ఫకార్ జమాన్ డకౌట్ అవడం ఇదే తొలిసారి.
భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భువీ మ్యాచ్ ఆరంభంలోనే జూలు విదిల్చాడు. తన అద్భుతమైన బౌలింగ్తో భువనేశ్వర్ (3/15) పాక్ను దెబ్బ కొట్టాడు. మూడో ఓవర్ తొలి బంతిని బయటకు వచ్చే ఆడే ప్రయత్నంలో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (2)ను, ఫకార్ జమాన్ (0)ను భువనేశ్వర్ తన వరుస ఓవర్లలో పెవిలియన్కు చేర్చాడు. కేవలం 15 పరుగుల వ్యవధిలోనే భువీ పాక్ ఓపెనర్లను పెవిలియన్కు చేర్చాడు. డెత్ ఓవర్లలో మళ్లీ బౌలింగ్కు వచ్చిన భువీ హాసన్ అలీ వికెట్ తీయడంతో ఈ మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆసియా కప్ టోర్నీలో భాగంగా హాంకాంగ్తో జరిగిన తొలి మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన భువనేశ్వర్ వికెట్ తీయకున్నా 50 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
మనీష్ పాండే సూపర్ క్యాచ్
పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే అద్భుత క్యాచ్తో ఔరా అనిపించాడు. గాయపడ్డ పాండ్యా స్థానంలో ఫీల్డింగ్కు వచ్చిన మనీష్ పాండే ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. కేదార్ జాదవ్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో సర్ఫరాజ్ అహ్మద్ భారీ షాట్కు ప్రయత్నించారు. వైడ్ లాంగ్ ఆఫ్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన పాండే.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మనీష్ పాండే పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు భావించిన పాండే బంతిని గాల్లోకి విసిరేసి బౌండరీ లైన్ను దాటి వచ్చి క్యాచ్ అందుకున్నాడు. అత్యంత కష్టమైన క్యాచ్ పాండే పట్టిన తీరు ప్రేక్షకుల్ని అలరించింది. దీంతో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ (6) పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు.
ఓపెనర్గా రోహిత్ శర్మ 100వ ఇన్నింగ్స్
ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మంగళవారం దుబాయి వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మకు ఇది 294వ మ్యాచ్ కావడం. అంతేకాదు ఓపెనర్గా రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ 100వ ఇన్నింగ్స్ కావడం విశేషం. తన 294వ మ్యాచ్లో రోహిత్ శర్మ 294వ సిక్సుని బాదాడు. మంగళవారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ మూడు సిక్సులు బాదడం ద్వారా ఈ మైలురాయిని అందుకున్నాడు.