హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. లంకలో జరుగుతోన్న ముక్కోణపు సిరీస్ నుంచి బీసీసీఐ కోహ్లీతో పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే.
Chilling and how! 😎 pic.twitter.com/GaRCzSWFCZ
— Virat Kohli (@imVkohli) March 11, 2018
ఈ నేపథ్యంలో కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. ప్రతి నిమిషాన్ని పండగ వాతావరణంగా గడుపుతూ.. తన సంతోషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు.
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చలాకీగా ఉండే కోహ్లీ, అనుష్క తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. భర్తపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ కోహ్లీకి ముద్దు పెడుతున్న ఫొటోను తన ఇన్స్టాగ్రాం ద్వారా పంచుకుంది 'లవ్లీ కపుల్, ఈ రోజు ఇంటర్నెట్లో బెస్ట్ పిక్చర్ ఇదే, మిమ్మల్ని చూస్తే అసూయగా ఉంది, క్యూట్ కపుల్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అలాగే కోహ్లీ కూడా తన భార్య అనుష్కతో దిగిన ఓ ఫొటోను ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లో షూటింగ్ ముగించుకుని ముంబైకి తిరిగొచ్చిన అనుష్కను రిసీవ్ చేసుకునేందుకు స్వయంగా కోహ్లీనే ఎయిర్పోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అభిమానుల్ని అలరించాయి.