యువ క్రికెటర్లపైనే దృష్టంతా
ఇంగ్లీషు గడ్డపై ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఓడిపోయి విమర్శలెదుర్కొన్న కోహ్లీ సేన ఈ సిరిస్తో తిరిగి గాడిలో పడాలని భావిస్తోంది. తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలతో పాటు ఇటీవలే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆంధ్ర కుర్రాడు హనుమ విహారీ, రిషబ్ పంత్లకు ఈ సిరిస్ ఎంతో కీలకం కానుంది. విండిస్ రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో జట్టు పటిష్టంగా ఉంది.
పటిష్టంగా భారత బ్యాటింగ్ లైనప్
బ్యాట్స్మెన్ విభాగంలో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి చోటు దక్కించుకోగా.... స్పిన్ బౌలర్ల విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఎంపికయ్యారు. షమీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ భారత పేస్ బౌలింగ్ భారం పంచుకోనున్నారు.
ఓపెనర్గా పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్
ఇంగ్లాండ్తో సిరీస్లో టెస్ట్ అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ ఏకైక వికెట్ కీపర్గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్గా పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్లలో ఎవరో ఒకరు కేఎల్ రాహల్తో ఓపెనింగ్కు దిగే అవకాశం ఉంది. కొత్త కుర్రాళ్ల ప్రదర్శన ఏ స్థాయిలో ఉండబోతోందో అని భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్వదేశంలో టీమిండియాది అత్యుత్తమ రికార్డు
తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, హనుమ విహారీలు సైతం ఈ సిరిస్లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక, స్వదేశంలో సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమ రికార్డుని కలిగి ఉన్న టీమిండియా విండిస్తో జరగనున్న సిరిస్లో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. రెండు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే టీమిండియా తన టెస్టు ర్యాంకుని మరింత పటిష్టం చేసుకుంటుంది.
వెస్టిండిస్ జట్టుతో తలపడే టీమిండియా:
విరాట్ కోహ్లి( కెప్టెన్ ), రహానే ( వైస్ కెప్టెన్ ), కేఎల్ రాహుల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.