ఓ స్టాండ్కి గంభీర్ పేరు
"టీమిండియాకు గౌతమ్ గంభీర్ చేసిన సేవలకు ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాం. నిజానికి ఓ స్టాండ్కి గంభీర్ పేరు పెట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నందున భారత క్రికెట్కు గంభీర్ చేసిన సహకారాన్ని మనం గౌరవించలేకపోవడం దురదృష్టకరం" అని చెప్పారు.
గంభీర్ పేరు యొక్క అక్షరాలను
"ఇప్పటికే గంభీర్ పేరు యొక్క అక్షరాలను స్టాండ్ మీద ఉంచమని ఆదేశించాం. నేటి అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో, స్టాండ్ను ఆవిష్కరించాలని, గంభీర్ను సత్కరించాలని నిర్ణయించాం. వచ్చే రంజీట్రోఫీ సీజన్ నుంచే ఈ స్టాండ్ అందుబాటులోకి వస్తుంది" అని డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రాజన్ మంచండా తెలిపారు.
2003లో వన్డే క్రికెట్ అరంగ్రేటం
2003లో వన్డే క్రికెట్ అరంగ్రేటం చేసిన గంభీర్ ముంబైలోని వాంఖడె వేదికగా శ్రీలంకతో జరిగిన 2011 వన్డే వరల్డ్కప్ పైనల్ మ్యాచ్లో కీలకపాత్ర పోషించాడు. 2011 వరల్డ్కప్ తర్వాత గంభీర్ పేలవ ప్రదర్శన చేయడంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అయితే 2012, 2014 ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ట్రోఫీలను అందించాడు.
2009లో ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా
టెస్టుల్లో సైతం గంభీర్ రికార్డు బాగానే ఉంది. 2008 జులై నుంచి 2010 జనవరి మధ్య కాలంలో తాను ఆడిన 13 టెస్టుల్లో 8 సెంచరీలు సాధించాడు. 2009లో ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. 2009లో నేపియర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో గంభీర్ ఇన్నింగ్స్ ఇప్పటికీ ప్రతి క్రికెట్ అభిమానికీ గుర్తే.
2018 డిసెంబర్లో క్రికెట్కు వీడ్కోలు
2018 డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన గంభీర్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీల చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీకి ఎంపీగా ఉన్నారు. టెస్టుల్లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన ఏకైక భారత బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీరే.