|
10వేల పరుగుల మైలురాయిని అందుకున్న ధోని
నిజానికి గతేడాదే ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే, అందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ తరఫున ఆడి చేసినవి కావడం విశేషం. 2007లో ఆఫ్రికా ఎలెవన్, ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన ఆ టోర్నీలో మూడు వన్డేలాడిన ధోనీ 174 పరుగులు చేశాడు.
|
టీమిండియా తరుఫున ఐదో ఆటగాడిగా
దీంతో ధోని ఖాతాలో ఉన్న 10,173 నుంచి ఆ పరుగుల్ని మినహాయిస్తే, టీమిండియా తరుఫున ధోని చేసినవి 9,999 మాత్రమే కావడంతో గణాంకాలు మారాయి. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో ధోని ఈ మైలురాయిని అందుకోవాల్సి ఉంది. విండీస్తో మూడు వన్డేల్లో మాత్రమే ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది.
|
కేవలం ఒక్క పరుగు దూరంలో
దీంతో మూడు వన్డేల్లో ధోని 20, 7, 23 చొప్పున మాత్రమే పరుగులు చేశాడు. తిరువనంతపురం వేదికగా నవంబర్ 1న జరిగిన చివరి వన్డేలో పదివేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు ధోని కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్లో ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు.
కోహ్లీనే ఉద్దేశపూర్వంగా అడ్డుపడ్డాడని
ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకోనివ్వకుండా కోహ్లీనే ఉద్దేశపూర్వంగా అడ్డుపడ్డాడని అప్పట్లో ట్విట్టర్లో నెటిజన్లు మండిపడ్డారు. భారత గడ్డపై పూర్తి చేయాల్సిన పది వేల పరుగులను ఆస్ట్రేలియాలో పూర్తి చేశాడు. 72 రోజుల నిరీక్షణ, 9100 కి.మీ. ప్రయాణం (త్రివేండ్రం-సిడ్నీ)అనంతరం ధోనీ ఈ మైలురాయిని సాధించడాని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.