టీమిండియా బ్యాటింగ్
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను పాక్ బౌలర్లు అఖిబ్ జావెద్, అజార్ మహ్మద్, మహ్మద్ అక్రమ్ తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. రాహుల్ ద్రవిడ్ (25)తో కలిసి అజహరుద్దీన్(67) నాలుగో వికెట్కు 66 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
29 బంతుల్లో 32 పరుగులు
చివర్లో రాబిన్ సింగ్ 29 బంతుల్లో 32 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాట్స్మన్ సయీద్ అన్వర్ (22), షాహిద్ అఫ్రిది (44) రాణించడంతో తొలి వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దీంతో పాక్ అలవోకగా విజయం సాధిస్తుందని అంతా భావించారు.
గంగూలీ రాకతో మ్యాచ్ మొత్తం తారుమారు
అయితే, సౌరవ్ గంగూలీ రాకతో మ్యాచ్ మొత్తం తారుమారైంది. మీడియం పేస్తో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో గంగూలీ తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 10-3-16-5 నమోదు చేశాడు. ఐజజ్ అహ్మద్, సలీమ్ మాలిక్, హసన్ రజా, మొయిన్ ఖాన్, జావెద్ను పెవిలియన్కు చేర్చాడు.
36.5 ఓవర్లకు 148 పరుగులు
దీంతో పాకిస్థాన్ 36.5 ఓవర్లకు 148 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో టీమిండియా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన సౌరవ్ గంగూలీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో 6 వన్డేల సిరీస్లో టీమిండియా 3-0తో ఆధిక్యంలో నిలిచింది.